విద్యార్థులకు పరీక్షలు మెదలయ్యాయి.టాలీవుడ్లో సమ్మర్ సీజన్
మొదలవుతోంది. ఈ సీజన్లోనే బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి సినిమాలు.
ఏప్రిల్ నెలలో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బిజీ కాబోతున్నాయి. అప్పటికే ఎండలు కాస్తా ముదిరి స్కూళ్లు మూతపడుతాయి.
స్టూడెంట్స్కు ఎగ్జామ్స్కూడా అయిపోతాయి. అందుకే ఆటైమ్లో థియేటర్లో సినిమాల తాకిడికూడా
భారీగా పెరగనుంది. అదికాస్తా మార్చి చివరి వారంనుంచే సినిమాల సందడి ప్రారంభంకానుంది.
ఎందుకంటే మార్చి 24న కాటమరాయుడు భారీ అంచనాలతో ప్రేక్షకులముందుకు రానుంది. కాటమరాయుడు
తాకిడి కాస్తా తగ్గేసరికే ఏప్రిల్ 28న బాహుబలి
సినిమాలు విడుదల
అవుతోంది. ఈ సినిమాను వెయ్యి కళ్లతో కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మెదటి పార్ట్
లో కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడని ప్రశ్నలపై విభిన్న కథనాలు సోషల్ మిడియాలో హల్
చల్ చేశాయి. కానీ అసలు కథ రాజమౌళి ఈ నె ఏప్రిల్లో బహుబలి -ది కంక్లూషన్ చేప్పబోతున్నాడు.
అయినాసరే టాలీవుడ్ లో మాత్రం అసలు ఏప్రిల్ సినిమాల హవా తగ్గట్లేదు. ఏప్రిల్ 7న వెంకటేష్ హీరోగా రూపొందిన సాలా కడూస్ సినిమా రీమేక్ ''గురు'' రిలీజవుతోంది. ఇకపోతే అదే తేదీన మణిరత్నం డైరక్షన్లో రూపొందిన ''చెలియా'' సినిమా కూడా రిలీజయ్యే ఛాన్సుంది. తెలుగులో దిల్ రాజు రూపొందిస్తున్న ఈ సినిమాలో కార్తి అండ్ అదితి రావ్ హైదారీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఏప్రియల్ 14న.. శ్రీను వైట్ల రూపొందిన వరుణ్ తేజ్ సినిమా ''మిష్టర్'' కూడా రిలీజవుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి , హెబ్బా పటేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే దారుణమైన ఫ్లాపులు చవిచూసిన శ్రీను వైట్ల రికవర్ కావాల్సి ఉంది. అలాగే వరుణ్ తేజ్ కూడా మార్కెట్ పటిష్టం చేసుకోవాలంటే.. ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే. వీటితోపాటు ఇంకొన్ని చిన్న సినిమాలు కూడా ఇదే నెలను టార్గెట్ చేయడం విశేషం. అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్యేశ్యంతో.. ఇలా ఏప్రిల్ వెంట పడ్డారనే చెప్పాలి. మరి ఈ సమ్మర్ సీజన్లో పొటాపొటిన రిలీజ్ అవుతున్నా సినిమాల్లో
ఏ సినిమా విజయం సాధిస్తోందో
చూడాలి.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి