ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల జీతం పెంపు

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి.ఓ.ఎ.) వేతనం పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో 18,405 మంది వి.ఓ.ఎ.లు రూ.500 నుంచి రూ.1,500 వరకు వేతనం మాత్రమే పొందుతున్నారు. ఆయా సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వేతనాలు అందుతున్నాయి. అయితే వీరు చేసే పనికి వస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదని రాష్ట్రంలోని వి.ఓ.ఎ.లు ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు. గ్రామైక్య సంఘాలు ఇచ్చే డబ్బులతో పాటు ప్రభుత్వం కూడా తమకు కొంత వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో వి.ఓ.ఎ.లు అప్పటి సమైక్య ప్రభుత్వానికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లభించలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్లో వి.ఓ.ఏ.లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతీ వి.ఓ.ఎ.కు నెలకు రూ.5వేల జీతం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామైక్య సంఘాలు రూ.2వేలు చెల్లించాలని, ప్రభుత్వం రూ.3వేలు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తన వాటాను సెర్ప్ ద్వారా చెల్లిస్తుందన్నారు. గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యత సూపర్ వైజర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
‘‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవ్వాలి. రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయి. మంచిపేరు వచ్చింది. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడపాలి. గ్రామాల్లో దొరికే వస్తువులను మార్కెట్ అవసరాలు తీర్చే విధంగా డ్వాక్రా సంఘాల మహిళలు ప్రాసెసింగ్ చేయాలి. కారంపొడి, పసుపు పొడి, పాపడాలు, కార, బొంది లాంటి డిమాండ్ ఉన్న వస్తువులను తయారు చేయాలి. అప్పుడు ప్రజలకు కల్తీలేని సరుకులు దొరుకుతాయి. మహిళలకు ఉపాధి లభిస్తుంది. డ్వాక్రా మహిళలలకు అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తాం. వేరే రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మహిళా సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాలి. పూర్తి స్థాయి కార్యక్రమాన్ని రచించి అమలు చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..