ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు- 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా

హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నగరంలో ఇప్పటికే అసాధారణ వర్షాలు కురవడంతో పాటు, ఇంకా వర్ష సూచన ఉన్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జిహెచ్ఎంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి, సిటి పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు. వర్షాల వల్ల నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాని ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. బస్తీల్లోకి నీరు రావడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని మరోచోటికి తరలించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కెటిఆర్ ను, అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతో పాటు, ఇతర సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నగర పోలీస్ కమీషనర్ ను సిఎం ఆదేశించారు. జిహెచ్ఎంసి లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (040-21111111) కు అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, దానిని బట్టి అధికార యంత్రాంగం వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. నగరంలో విద్యుత్, రహదారులు, డ్రైనేజి, మ్యాన్ హోల్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. నగర నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరుతున్నదని, అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..