ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు- 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా

హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నగరంలో ఇప్పటికే అసాధారణ వర్షాలు కురవడంతో పాటు, ఇంకా వర్ష సూచన ఉన్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జిహెచ్ఎంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి, సిటి పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు. వర్షాల వల్ల నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాని ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. బస్తీల్లోకి నీరు రావడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని మరోచోటికి తరలించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కెటిఆర్ ను, అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతో పాటు, ఇతర సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నగర పోలీస్ కమీషనర్ ను సిఎం ఆదేశించారు. జిహెచ్ఎంసి లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (040-21111111) కు అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, దానిని బట్టి అధికార యంత్రాంగం వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. నగరంలో విద్యుత్, రహదారులు, డ్రైనేజి, మ్యాన్ హోల్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. నగర నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరుతున్నదని, అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.