ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సెర్ప్, నరేగా ఉద్యోగుల వేతనాలు పెంపు

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సెర్ప్, నరేగా ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ప్ సిఇఓ పౌసమిబసు తదితరులతో క్యాంపు కార్యాలయంలో సిఎం మంగళవారం సమీక్ష జరిపారు. సెర్ప్, నరేగాలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలపై చర్చించారు. వారి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా అన్నారు. సెర్ప్ లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మంది మండల సమాఖ్య క్లస్టర్ కో-ఆర్డినేటర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్లస్టర్ కో-ఆర్డినేటర్ల వేతనం ప్రస్తుతం రూ.6,150 ఉంది. దీన్ని రూ.12,000కు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మిగతా సెర్ప్ ఉద్యోగుల వేతనాలు 30 శాతం మేర పెంచాలని సిఎం ఆదేశించారు. మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పది వేల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 6,982 ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.6,290 జీతంతో పనిచేస్తున్నారు. వీరి వేతనాన్ని రూ.10,000కు పెంచాలని సిఎం నిర్ణయించారు. నరేగాలోని మిగతా ఉద్యోగుల వేతనాలను 20శాతం మేర పెంచాలని ఆదేశించారు. పెంచిన జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రిని ఆదేశించారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.