ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డబుల్ బెడ్ రూమ్ఇండ్ల నిర్మాణ0 వేగవంతం

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల కోసం వేర్వేరు పద్ధతులు అవలంభించాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పేదల బస్తీలను అన్ని మౌలిక సదుపాయాలతో మంచి లే-అవుట్ కాలనీలుగా తీర్చిదిద్దాలని అన్నారు. బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కొత్త విధానం అవలంభిస్తున్నందున, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పద్ధతులను కొనసాగించాల్సిన అవసరం లేదని సిఎం స్పష్టం చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సిఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
జిల్లాల్లో రెండు లక్షలు, హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణం కోసం అనువైన ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న బస్తీలను మంచి కాలనీలుగా మార్చాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాల పనులను వేగవంతం చేయాలని కోరారు. నగరంలో పేదల బస్తీలను అన్ని వసతులతో కూడిన కాలనీలుగా మార్చే క్రమంలో మంచినీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వ పరంగానే కల్పించాలని చెప్పారు. ఇంకా పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ శాఖ వద్ద స్థలాలతో పాటు దిల్, టి.ఎస్.ఐ.ఐ.సి. ఆధీనంలో ఉన్న భూములు కూడా వినియోగించాలని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ భూములను కూడా కేటాయించడానికి సిద్ధమన్నారు.
గ్రామీణ ప్రాంతాల మాదిరిగా హైదరాబాద్ లో ఇండ్ల నిర్మాణం కోసం ఎక్కువ స్థలం దొరకదు కాబట్టి, బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని సిఎం సూచించారు. మూడు నుంచి తొమ్మిది అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కట్టడాలకు మైవాన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున హైదరాబాద్ ఇండ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చే సంస్థలకు ఆ టెక్నాలజీ వాడుకోవడానికి అనుమతించాలని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలతో చర్చలు జరిపి, ఒప్పందాలు ఖరారు చేయాలని ఆదేశించారు. సులభంగా, తొందరగా ఇండ్లు కట్టడానికి ఏ పద్దతి అందుబాటులో ఉంటే దాన్ని అవలంభించాలని ఆదేశించారు.
బలహీన వర్గాలు, పేదల కోసం కట్టే ఇండ్లకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందచేయాలని నిర్ణయించామని, సిమెంట్ కంపెనీలతో మాట్లాడి ఫ్యాక్టరీ ధరకే సిమెంటు కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న వాంబే, జె.ఎన్.ఆర్.ఎం. గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. దీనికి కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి సిఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. రాజీవ్ స్వగృహ ద్వారా నిర్మించిన ఇండ్లను ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించినందున, దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు.
జిల్లాలలో ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభమయిందని, వాటి వేగం కూడా పెంచాలని చెప్పారు. స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలన్నారు. ఎక్కడి వారు అక్కడ ఇండ్లు కట్టుకోవడం మంచిదని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు. లబ్ధిదారుల ఎంపిక, పనుల అప్పగింత తదితర వ్యవహారాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..