ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణలో ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు

తెలంగాణలో బలహీనవర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున అందుకునుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగ నిబంధన కాబట్టి, అందుకునుగుణంగా తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్ పెంచే విషయంలో తగు చర్యలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు. ఎస్టీలు, మైనారిటీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపిన చెల్లప్ప, సుధీర్ కమిషన్లు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి నివేదికలు అందచేశాయి.
 తెలంగాణలో ముస్లింలకు అత్యంత పెదరికంలో ఉన్నారు కాబట్టి, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని, తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి ప్రత్యేక చట్టం తెస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. షెడ్యూల్ తెగల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగమే చెబుతున్నదని, దాని ప్రకారం తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన ఉందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు దక్కాయని, దీనివల్ల తెలంగాణ ఎస్టీలు నష్టపోయారని సిఎం అన్నారు. తెలంగాణలో ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెల్లప్ప, సుధీర్ కమిషన్లు సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించి ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు తీసుకుంటుందని సిఎం చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..