ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కేసిఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా?

ఇటీవల కాలంలోని పరిణామాలు చూస్తుంటే...కేసిఆర్, జగన్ ల మధ్య ఉన్న సంబంధాలపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తెలంగాణకు వ్యతిరేకమైన సమైక్యాంధ్ర నినాదాన్ని చంద్రబాబు కంటే జగన్ గట్టిగా వినిపిస్తున్నా...కేసిఆర్ మాత్రం జగన్ కాకుండా చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో సమైక్యంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ముక్కలు కావడానికి చంద్రబాబు కంటే కేసిఆర్ ఎక్కువ కారణమైతే...సమైక్యాంధ్ర కోరుకునే జగన్ కేసిఆర్ ను వదిలి బాబుపై మండిపడుతున్నారు. తమ సిద్దాంతాలకు విరుద్దమైన వ్యక్తులను ఒకరినొకరు విమర్శించుకోకుండా మధ్యలోని వ్యక్తులపై ఈ ఇద్దరు నాయకులు మాట్లాడడంపై వీరిమధ్య ఏమైనా అవగాహన ఒప్పందా ఉందా అనుమానాలను బలపరుస్తోంది.తెలంగాణ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ లో సభ పెట్టడానికి ఏపీఎన్జీవోలు సంసిద్దమైతే టిఆర్ఎస్, టీజేఏసీ తీవ్రంగా విరుచుకుపడ్డాయి. సభ పెట్టడానికి వీలు లేదని, అనుమతులిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాయి. చివరకు సభకు అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య సభకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారంటూ, ఆయన తీరుకు నిరసన పేరుతో తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చి, నిరసన వ్యక్తం చేశారు. సభలో తెలంగాణ వాదులపై జరిగిన దాడిపై దుమారం లేపారు. అయితే ఈ సభ వివాదం పూర్తి కాకముందే జైలు నుంచి వచ్చిన జగన్ హైదరాబాద్ లో సమైక్య శంఖారావం పూరిస్తానన్నప్పుడు టిఆర్ఎస్, టీజేఏసీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.టిఆర్ఎస్, వైఎస్సార్సీపి ఎవరి కారణాలు వారు చెప్పుకుంటున్నా...రాజకీయాల్లో  శత్రుపక్షంలో బలంగా ఉన్న వాళ్లను విమర్శించకపోవడంపై అనుమానాలు రావడం సహజం. అయితే ఈ అనుమానాల్లో వాస్తవం ఎంతవరకు ఉందనేది ఎన్నికల్లో తేలుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.