ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రశాంతంగ ముగిసిన సమైక్య శంఖారావం సభ

వైసీపీ నిర్వహించిన సమైక్య శంఖారావం సభ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. అక్కడక్కడ చదురుముదురు ఘటనలు మినహా సభ ప్రశాంతంగా జరిగింది.  సభ జరిగే సమయంలో నిజాం హాస్టల్ విద్యార్ధులు ఆందోళనకు దిగడంతో.. కట్టుదిట్టమైన భద్రతతో నిరసనకారుల్ని బయటకిరాకుండా కట్టడి చేశారు.సమైక్య శంఖారావం సభ  సాఫీగా సాగడంతో.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీస్ నిఘా నీడలో సభ సజావుగా ముగిసింది.. సభ జరిగే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. సభకు 3300 మంది పోలీసులు పహారా కాశారు.. ఇందులో 34 ప్లాట్లూన్ల ఏపీఎస్పీ, 16 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, 1800 మంది సివిల్ పోలీసులు ఉన్నారు.  ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలను  ఆధీనంలోకి తీసుకుని అనుమానాస్పద వ్యక్తుల పైన నిఘా పెట్టారు.సిసి కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు  సభలోకి వెళ్ళే వారిని పర్యవేక్షించారు.  తెలంగాణ వాదులను గుర్తించి వారి అదుపులోకి తీసుకున్నారు.. సభలో కొంత మంది తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్ట్ చేశారు... సభ జరిగే సమయంలో నిజాం హాస్టల్ విద్యార్ధులు ఆందోళన చేశారు.. వారిని బయటకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం