ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రశాంతంగ ముగిసిన సమైక్య శంఖారావం సభ

వైసీపీ నిర్వహించిన సమైక్య శంఖారావం సభ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. అక్కడక్కడ చదురుముదురు ఘటనలు మినహా సభ ప్రశాంతంగా జరిగింది.  సభ జరిగే సమయంలో నిజాం హాస్టల్ విద్యార్ధులు ఆందోళనకు దిగడంతో.. కట్టుదిట్టమైన భద్రతతో నిరసనకారుల్ని బయటకిరాకుండా కట్టడి చేశారు.సమైక్య శంఖారావం సభ  సాఫీగా సాగడంతో.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీస్ నిఘా నీడలో సభ సజావుగా ముగిసింది.. సభ జరిగే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. సభకు 3300 మంది పోలీసులు పహారా కాశారు.. ఇందులో 34 ప్లాట్లూన్ల ఏపీఎస్పీ, 16 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, 1800 మంది సివిల్ పోలీసులు ఉన్నారు.  ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలను  ఆధీనంలోకి తీసుకుని అనుమానాస్పద వ్యక్తుల పైన నిఘా పెట్టారు.సిసి కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు  సభలోకి వెళ్ళే వారిని పర్యవేక్షించారు.  తెలంగాణ వాదులను గుర్తించి వారి అదుపులోకి తీసుకున్నారు.. సభలో కొంత మంది తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్ట్ చేశారు... సభ జరిగే సమయంలో నిజాం హాస్టల్ విద్యార్ధులు ఆందోళన చేశారు.. వారిని బయటకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.