ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కుండపోత వర్షాలు

కుండపోతతో కుదేలవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.  వరుణుడి ప్రతాపం మరో 48 గంటలు ఉంటుందని ప్రకటించింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే అన్నదాతల ఆశలు ఆవిరైపోయాయి. సామాన్యుల జీవనం ఛిన్నాభిన్నమైంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో కోస్తావాసుల గుండె చెరువవుతోంది. రానున్న 48 గంటల్లో కోస్తా ఆంధ్రలో అధికప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, రాయలసీమల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.

పంటను దక్కించుకోడానికి వాన కోసం ఆకాశం వైపు చూసే రైతన్నపై.. ఆ వానే పిడుగులా పడింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల పరిస్థితి బాగుందనుకుంటున్న దశలో అశనిపాతంలా రైతును వర్షం ముంచేసింది. వ్యవసాయ శాఖ సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 15 జిల్లాల్లోని 287 మండలాల్లో 10,72,110 ఎకరాల మేరకు వివిధ పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పంట ముంపు విస్తీర్ణం ఇంకా పెరుగుతోంది. భారీ వర్షాలకు ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో పంట ముంపు తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, పత్తి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు