ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాళ్ల జల్లు

కేంద్రమంత్రి చిరంజీవి. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ప్రజలకు, మీడియాకు వీలైనంత దూరాన్ని మెయింటెయిన్ చేస్తున్న లీడర్.  అంతా మనకు నచ్చినట్లుగా జరగదు కదా ! విధి ఆయన్ని వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచేయడంతో తీర రైతులు, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు బాగా నష్టపోయారు. బాధితులని పరామర్శించాలనుకున్నారో లేకపోతో ఇప్పుడు కూడా వెళ్లకపోతే మళ్లీ మొహం చూపించలేమనుకున్నారో కాని అంతే....చిరు సారు వారు సీమాంధ్రలో వాలిపోయారు. ఓదార్పకు బయల్దేరారు
తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది చిన్నపాటి ప్రమాదం కాబట్టి మెగాస్టార్ పెద్దగా ట్టించుకోలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రమాదాన్ని మించిన ఘోర పరాభవం అంతకు మించిన అవమానం ఎదురయ్యాయి. ఒకప్పుడు పూలవర్షం కురిపించిన ఆ ప్రాంతప్రజలు ఈ సారి రాళ్ల జల్లు కురిపించారు. పొంగుకొస్తున్న ఆవేశాన్ని బయటపెట్టలేక... చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుంచి ఏం చక్కా చెక్కేశారు మెగాస్టార్. ఇక్కడా చిరుకు ఎదురు పరామర్శలే ఎదురవడంతో  కన్నీళ్లు  తుడుద్దామని వచ్చిన తననే.... పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని ఫీలయ్ ఉంటారు పాపం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు