ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాళ్ల జల్లు

కేంద్రమంత్రి చిరంజీవి. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ప్రజలకు, మీడియాకు వీలైనంత దూరాన్ని మెయింటెయిన్ చేస్తున్న లీడర్.  అంతా మనకు నచ్చినట్లుగా జరగదు కదా ! విధి ఆయన్ని వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచేయడంతో తీర రైతులు, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు బాగా నష్టపోయారు. బాధితులని పరామర్శించాలనుకున్నారో లేకపోతో ఇప్పుడు కూడా వెళ్లకపోతే మళ్లీ మొహం చూపించలేమనుకున్నారో కాని అంతే....చిరు సారు వారు సీమాంధ్రలో వాలిపోయారు. ఓదార్పకు బయల్దేరారు
తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది చిన్నపాటి ప్రమాదం కాబట్టి మెగాస్టార్ పెద్దగా ట్టించుకోలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రమాదాన్ని మించిన ఘోర పరాభవం అంతకు మించిన అవమానం ఎదురయ్యాయి. ఒకప్పుడు పూలవర్షం కురిపించిన ఆ ప్రాంతప్రజలు ఈ సారి రాళ్ల జల్లు కురిపించారు. పొంగుకొస్తున్న ఆవేశాన్ని బయటపెట్టలేక... చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుంచి ఏం చక్కా చెక్కేశారు మెగాస్టార్. ఇక్కడా చిరుకు ఎదురు పరామర్శలే ఎదురవడంతో  కన్నీళ్లు  తుడుద్దామని వచ్చిన తననే.... పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని ఫీలయ్ ఉంటారు పాపం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..