ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాష్ట్ర విభజన - దూకుడు

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. విభజన వద్దంటూ సీమాంధ్ర ప్రజలు ఎంతగా గగ్గోలు పెడుతున్నా... ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా... ఎక్కడా తగ్గడం లేదు. ఎవరేమనుకుంటే లేక్కేమిటి అన్నట్టుగా.... తాను అనుకున్నది తాను చేసుకుపోతోంది. కోస్తా జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతోంటే... నష్టం అంచనాకి కేంద్ర బృందాన్ని పంపించాల్సింది పోయి... విభజన కోసం టాస్క్ ఫోర్స్ ని పంపించింది. ఏదెలా ఉన్నా తనకు విభజనే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇలా జీవోఎం... తనపని తాను చేసుకుపోతోంటే... కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ కమిటీ హైదరాబాద్ వచ్చింది.  విభజన అనంతరం రక్షణ, శాంతి, భద్రతలు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేపట్టింది. తొలిరోజు సమావేశంలో ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురయ్యే శాంతి భద్రతల సమస్యలపై ఈ బృందం చర్చలు జరిపింది. పోలీసు సిబ్బందిని ఎక్కడెక్కడ ఎంతమందిని ఉంచాలి.... ఆస్తుల పంపిణీ ఎలా అనే సమాచారాన్ని కూడా హోం శాఖ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సేకరిస్తోంది. ఈ బృందం గురువారం మధ్యాహ్నం మరోసారి భేటీ అవుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..