ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి

భారీ వర్షాలు, వరదలతో కోస్తా జిల్లాలు అల్లాడుతోంటే... పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పార్టీల నేతలు... బాధితులకు మేమున్నామనే ధైర్యం కల్పించాల్సింది పోయి.... అక్కడ కూడా వైరి పక్షాలపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.
ఫైలిన్ తుపాను సృష్టించిన బీభత్సం ఓ వైపు... ఆ వెంటనే ముంచుకొచ్చిన భారీ వర్షాలు మరోవైపు.... సీమాంధ్రలో తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికందాల్సిన పంట నీళ్ళపాలవడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు అల్లాడుతోంటే... సర్వం కోల్పోయి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న అభాగ్యులు... ఆపన్న హస్తం కోసం ఆశగా చూస్తున్నారు. తమ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, తామిచ్చిన ఓట్ల బలంతో అధికార పీఠాన్ని అధిష్టించి....... రాజ్యమేలుతున్న అధికార పార్టీ ఈ కష్టకాలంలో తమని ఆదుకుంటుందని ఆశిస్తున్నవారికి.. అణువంత భరోసా కూడా లభించడం లేదు. ఆపత్కాలంలో మేమున్నామంటూ మందుకు వచ్చి.... వీలైనంతగా ఆదుకోవాల్సిన రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు దీనికి భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. పరామర్శల పేరుతో జనంలోకి వెళుతున్న నేతలు... బురద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రజల కష్ట, నష్టాలను తెలుసుకోవాల్సిన నేతలు.... ఈ పరిస్థితిని ఎలా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన ప్రధాన నేతలు మూడు  వేర్వారు ప్రాంతాలను ఎన్నుకుని  పర్యటిస్తున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు