ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి

భారీ వర్షాలు, వరదలతో కోస్తా జిల్లాలు అల్లాడుతోంటే... పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పార్టీల నేతలు... బాధితులకు మేమున్నామనే ధైర్యం కల్పించాల్సింది పోయి.... అక్కడ కూడా వైరి పక్షాలపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.
ఫైలిన్ తుపాను సృష్టించిన బీభత్సం ఓ వైపు... ఆ వెంటనే ముంచుకొచ్చిన భారీ వర్షాలు మరోవైపు.... సీమాంధ్రలో తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికందాల్సిన పంట నీళ్ళపాలవడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు అల్లాడుతోంటే... సర్వం కోల్పోయి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న అభాగ్యులు... ఆపన్న హస్తం కోసం ఆశగా చూస్తున్నారు. తమ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, తామిచ్చిన ఓట్ల బలంతో అధికార పీఠాన్ని అధిష్టించి....... రాజ్యమేలుతున్న అధికార పార్టీ ఈ కష్టకాలంలో తమని ఆదుకుంటుందని ఆశిస్తున్నవారికి.. అణువంత భరోసా కూడా లభించడం లేదు. ఆపత్కాలంలో మేమున్నామంటూ మందుకు వచ్చి.... వీలైనంతగా ఆదుకోవాల్సిన రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు దీనికి భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. పరామర్శల పేరుతో జనంలోకి వెళుతున్న నేతలు... బురద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రజల కష్ట, నష్టాలను తెలుసుకోవాల్సిన నేతలు.... ఈ పరిస్థితిని ఎలా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన ప్రధాన నేతలు మూడు  వేర్వారు ప్రాంతాలను ఎన్నుకుని  పర్యటిస్తున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.