నిధులు, భూసేకరణ సమస్యలు లేనందున నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి రైతుల పొలాల్లోకి సాగునీరు పంపాలని ,ముఖ్యంగా కరువు పీడిత, వలస బాధిత పాలమూరు జిల్లా రైతులకు సాగునీరు అందించడం మొదటి లక్ష్యంగా, పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.నీటి పారుదల ప్రాజెక్టుల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ప్రతి నెలా 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నందున నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని సిఎం అన్నారు.పాలమూరు ఎత్తిపోతల కి సంబంధించిన ఇంటేక్ వెల్స్, పంప్ హౌజ్ లు, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెళ్ళ నిర్మాణం సమాంతరంగా, వీటికి సంబంధించిన డిజైన్లను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. రిజర్వాయర్ల సామార్థ్యాన్ని కూడా నిర్మాణాలకు అనుగుణంగా క్రమంగా పెంచుకుంటూ పోవాలన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి