ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏపీలో నాలుగు ఉచిత వైద్య సేవలు



రాష్ట్రప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్ష నకు ఏపీని సంపూర్ణ ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో  బుధవారం నాడు నాలుగు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది.

 పిరామల్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో, రాష్ట్రంలోని 13వేల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చంద్రన్న సంచార చికిత్స పేరిట 275 మొబైల్మెడికల్యూనిట్ల(ఎంఎంయూ) వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిలో పనిచేసేందుకు మెడికల్ఆఫీసర్‌, ఫార్మాసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు, 300మంది వైద్యులు, 900మంది పారామెడికల్సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. గర్భిణులకు, చిన్నారులకు, సాధారణ వ్యాధులకు, తీవ్రమైన అంటువ్యాధులకు, దంత, కంటి, ఈఎన్టీ సహా పలు వైద్య పరీక్షలను నిర్వహించి చికిత్స అందిస్తారు. వ్యాధి నిరోధక టీకాలనూ వేస్తారు. 

సీటీ స్కాన్‌:రాష్ట్రంలోని టెక్కలి, చీరాల, ప్రొద్దుటూరు, గూడూరుల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా సోమవారం నుంచి సీటీ స్కాన్సేవలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ వైద్య పరీక్షలలో భాగంగా సీటీ స్కాన్‌ యూనిట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు