అమ్మాయిలను వ్యభిచార కూపాలకు పంపే దురాచారానికి వ్యతిరేకంగా,సామాజిక దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన నా బంగారు తల్లి సినిమాను ప్రభుత్వ పరంగా ప్రొత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. సినిమాకు వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్లోనే నిర్మించారని, ఇందులో నటీ నటులు కూడా తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. సమాజానికి మంచి సందేశం అందించే ఇతివృత్తంతో ఈ సినిమా తీశారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి సినిమాలను ప్రొత్సహించడం ఓ విధానంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నదని అన్నారు. సినిమాకు రూపకల్పన చేసిన స్వచ్చంద కార్యకర్త ప్రజ్వలను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న ఈ చిత్రం మరిన్ని సామాజిక చిత్రాలు రావడానికి ప్రేరణ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి