ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"బంగారు తల్లి" సినిమా- వినోదపు పన్ను మినహాయింపు

అమ్మాయిలను వ్యభిచార కూపాలకు పంపే దురాచారానికి వ్యతిరేకంగా,సామాజిక దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన నా బంగారు తల్లి సినిమాను ప్రభుత్వ పరంగా ప్రొత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సినిమాకు వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే నిర్మించారని, ఇందులో నటీ నటులు కూడా తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. సమాజానికి మంచి సందేశం అందించే ఇతివృత్తంతో ఈ సినిమా తీశారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి సినిమాలను ప్రొత్సహించడం ఓ విధానంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నదని అన్నారు. సినిమాకు రూపకల్పన చేసిన స్వచ్చంద కార్యకర్త ప్రజ్వలను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న ఈ చిత్రం మరిన్ని సామాజిక చిత్రాలు రావడానికి ప్రేరణ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు