ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తునీసియా తరహాలో హైదరాబాద్‌ అభివృద్ది

తునీసియాలో నిర్మిస్తున్న కొత్త నగరం తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. సౌది అరేబియా రాయల్‌ ఫామిలీ ప్రతినిధి డాక్టర్‌ ఫయిజ్‌ అల్‌ అబెడీన్‌ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు, కొత్త ప్రభుత్వాని ఏర్పాటు చేసి అభివృద్ది పథంలో నడుస్తున్నందుకు సౌది అరేబియా రాజు పంపిన అభినందన వర్తమానాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్బంగా ఫయిజ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఓ ఆదర్శవంతమైన లౌకిక రాష్ట్రంగా ముందుకు పోతున్నదన్నారు. ముస్లింలకు అత్యంత ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. పునర్‌నిర్మాణ దశలో ఉన్న తెలంగాణకు సహకారం అందించాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పడం, నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వైద్య రంగంలో సహకరించడం లాంటి లక్ష్యాలు తమకు ఉన్నాయన్నారు. కొత్తగా నిర్మిస్తున్న తునీసియా నగర నమూనాను ముఖ్యమంత్రికి చూపించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటి, స్పోర్ట్స్‌ సిటి లాంటి 16 వేరు వేరు సిటీలతో నిర్మాణంలో ఉన్న తునీసియా కొత్త నగర అనిమేషన్‌ దృశ్యాలను కూడా చూపించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ చుట్టు ప్రక్కల కూడా సినిమా సిటి, స్పోర్ట్స్‌ సిటి, ఫార్మా సిటి తదితర సిటీలను నిర్మించాలని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచి వాతావరణం, సహృద్బావ సంబంధాలు, మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్‌ నగరానికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉందన్నారు. తునీసియా కొత్త నగరంలాగా అభివృద్ది చెందుతూనే గత చరిత్ర ఆనవాళ్లు చెదిరిపోకుండా ఇస్తాంబుల్‌ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నది తన ఉద్దేశమని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమ మరింత అభివృద్ది చెందుతుందని తాము అమల్లోకి తెచ్చిన పారిశ్రామిక సింగిల్‌విండో విధానం కూడా తెలంగాణకు పెట్టుబడులను తెస్తాయని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సౌది అరేబియా సహకారం తీసుకుంటామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, విద్యుత్‌ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎంఓ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.