ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ విద్యుత్ పాటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి

తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ విద్యుత్ పాటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను కూడా పరిశీలించాలని, దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనుభవం ఉన్న గ్రీన్ కో ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి పలు ప్రతిపాదనలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 వరకు 800 మెగావాట్లకు పైగా సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తామని, ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారు. అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ తో పాటు పవన్ విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఒక దఫా సౌర విద్యుత్ కోసం టెండర్లు పిలిచామని, అవసరమైతే మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో దాదాపు 2 వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉన్నదని, పగటి పూట విద్యుత్ అందించే సోలార్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు పగటి పూట కరెంటు అందివ్వవచ్చని, సోలార్ విద్యుత్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. పవన్ విద్యుత్ కూడా ఎక్కువ చోట్ల పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సామర్థ్యం కలిగిన విద్యుత్ అవసరాలు ఉన్న చోట పవన విద్యుత్ చాలా ఉపయోగమన్నారు. రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పవన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఇప్పటికే అనుభవం ఉన్న సంస్థలతో ఈ పని చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. న్యూయార్క్, ముంబాయి నగరాలలో 24 గంటల కరెంటు అందుబాటులోకి తెచ్చినట్లే హైదరాబాద్ నగరంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు, ఐటి సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు 24 గంటల పాటు పనిచేసినా కూడా విద్యుత్ కొరత లేని విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎంపిలు కె. కేశవరావు, బూర నర్సయ్య, ఎంఎల్సి సలీం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, ఎస్.కె. జోషి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..