ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంతర్జాతీయ స్థాయి సినిమాసిటి, స్పోర్ట్స్‌ సిటిలు :కె.చంద్రశేఖర్‌ రావు

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమాసిటి, స్పోర్ట్స్‌ సిటిలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చెప్పారు. అందుకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలతో కలిసి రాచకొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి సోమవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. రాచకొండ ప్రాంతంలో కాలినడకన కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దాదా...పు 31 వేల ఎకరాలకు పైగా భూమి ఈ ప్రాంతంలో ఉందని, ఇది తెలంగాణలో పలు పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాలు స్థాపించడానికి అనువైనదని చెప్పారు. కాలుష్యం వెదజల్లని సంస్థలన్నింటిని ఇక్కడే నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సినిమా సిటి,స్పోర్ట్స్‌ సిటి, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాచకొండ ప్రాంతంలో చదును ఉన్న భూమి ఎక్కువగా ఉంది, కొద్దిపాటి కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిన్నింటిని ఉపయోగించుకొని తెలంగాణకు తలమానికంగా నిలిచే సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కలెక్టర్లు శ్రీధర్‌, చిరంజీవులు పాల్గోన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం