ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాస్‌ డాక్‌) -ఆవిష్కరణ

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాక్‌) పేరును నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాస్‌ డాక్‌) గా మార్చాలని గవర్నింగ్‌ బాడి సమావేశంలో నిర్ణయించారు. నాక్‌ గవర్నింగ్‌ బాడి సమావేశం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరిగింది. నిర్మాణ రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునే విధంగా నాక్‌ తయారు కావాలని ముఖ్యమంత్రి కోరారు. నిర్మాణ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారిలో వృత్తి నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కార్యక్రమాలు ఉండాలన్నారు. అందుకే నాక్‌ పేరును నాస్‌ డాక్‌ గా మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నాక్‌ ఉద్యోగుల జీతాలను 20 శాతం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయెట్లకు తగు శిక్షణ ఇవ్వాలని, క్లాస్‌ 1 కాంట్రాక్టర్ల వద్ద శిక్షణనిప్పించి వారిని నిలదొక్కుకునేలా తయారు చేయాలని సూచించారు. గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ ప్రకారం నిర్మాణాలు జరిగే విధంగా నాక్‌ చొరవ చూపాలన్నారు. తక్కువ స్తలంలో ఎక్కువ మంది చాలా సౌకర్యవంతంగా విధులు నిర్వహించే విధంగా భవన నిర్మాణ డిజైన్‌లు ఉండాలన్నారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్‌శర్మ, మంత్రి శ్రీ ఈటెల రాజేందర్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగరావు, ఆర్‌ అండ్‌ బి శాఖ కార్యదర్శి శ్రీ సునిల్‌ శర్మ, నాక్‌ డిజి శ్రీ బిక్షపతి తదితరులు పాల్గోన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..