మంజీరా నీటిని మెదక్ జిల్లా సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకొనే విధంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంజీరా నీరు హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాల కోసం వినియోగిస్తున్నందువల్ల ప్రస్తుతం మెదక్ జిల్లాకు సాగునీటి కొరత ఏర్పడుతున్నదన్నారు. కృష్ణా నది నీటిని హైదరాబాద్ తరలించి మంజీరా నీటిని మెదక్ జిల్లాలో వినియోగించాలన్నది తమ లక్ష్యమని సిఎం ప్రకటించారు. మంజీరా నీటిని సింగూర్ ప్రాజెక్టులో నిలువ చేసి ఘనపూర్ ఆనికట్ ద్వారా మెదక్ జిల్లాలో 25 వేల ఎకరాలకు నీరందించే విధంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్ జిల్లా పుల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపుర్ ఆనికట్ను ముఖ్యమంత్రి సందర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఘనపూర్ ఆనికట్ పైన, మంజీరా నది పొడవునా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా ఘనపూర్ ఆనికట్పై సమీక్ష చేశారు. మంజీరా నది ద్వారా 4.06 టి.ఎం.సి. ల నీటి కేటాయింపు ఘనపూర్ ఆనికట్కు ఉందన్నారు. దీని ద్వారా ధర్మంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందాలని, కాని ప్రస్తుతం 12 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 25 వేల ఎకరాలకు నీరందించాలని, వీలయితే మరో 5 వేల ఎకరాలకు ఎక్కువగానే నీరివ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆనికట్ కాలువల్లో బాగా పూడిక పేరుకుపోయిందని, దాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలవలన్ని మట్టితోనే ఉన్నందున అవి పూడుకుపోయాయని, కాలువలకు లైనింగ్ వేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని పంపాలని చెప్పారు. ఆనికట్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగే అవకాశం ఉందని, ఈ ప్రమాదాన్ని నివారించడానికి కరకట్టలు నిర్మించాలని సిఎం ఆదేశించారు. పూర్తి స్థాయి నీటి నిలువ సామార్థ్యాన్ని కాపాడటానికి తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్వమంత్రి ఆదేశించారు. ఘనపూర్ ఆనికట్ పరిధిలో తాను గతంలో పాద యాత్రలు చేశానని, మంజీరా నదిలో ఇక్కడే పుష్కర స్నానం చేశానని సిఎం గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో ఘనపూర్ ఆనికట్ నిర్వహణను విస్మరించారని,కాలువలకు లైనింగ్ వేయకపోవడం వల్ల అవి శిథిలమై పోయాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఈ ఆనికట్పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామన్నారు. 1905లో నిర్మించిన ఈ ఆనికట్ ద్వారా కొత్తగా పంట పొలాలను ముంచకుండానే ఎక్కువ నీటిని నిలువ చేసుకునే మార్గాలు అన్వేషించాలన్నారు. ఒకటిన్నర నుండి రెండు టి.ఎం.సి.ల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకోవాలని, నీరు పంట పొలాలకు తరలిస్తున్న కొద్ది ఏర్పడే ఖాళిని సింగూర్ ప్రాజెక్టు ద్వారా భర్తీ చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి