ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కార్యాలయాలు తరలించవద్దు : కె. చంద్రశేఖర్ రావు

తెలంగాణ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన కార్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేయాల్సిందే తప్ప ఎక్కడ కూడా ఉన్న కార్యాలయాలు తొలగించవద్దని   ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో కార్యాలయాలు తరలిస్తారనే ప్రచారం జరుగుతున్నదని మంత్రి లక్ష్మారెడ్డి, ములుగులో ఏ ఒక్క కార్యాలయాన్ని తరలించవద్దని మంత్రి చందూలాల్, మరిపెడలో కార్యాలయాలు తరలించవద్దని మాజీ మంత్రి రెడ్యానాయక్ ముఖ్యమంత్రిని కోరారు. మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి వినతులే ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ముఖ్యమంత్రి విస్పష్టమైన ఆదేశిలిచ్చారు.
‘‘రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పట్టణాలు, ప్రాంతాల్లో వివిధ స్థాయిల కార్యాలయాలున్నాయి. కొత్తగా మళ్లీ జిల్లాలు, డివిజన్లు, మండలాలు వస్తున్నాయి. కొత్తగా కార్యాలయాలు అవసరం ఉన్న చోట ఏర్పాటు చేయండి. కానీ ఒక్క చోట నుంచి కూడా ఒక్క కార్యాలయాన్ని కూడా వేరే చోటకి తరలించవద్దు. సౌకర్యాలు పెంచేందుకు పరిపాలన విభాగాలు పెంచుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాలను తొలగించడం సబబు కాదు. కాబట్టి ఏ కార్యాలయాన్ని కూడా మరో చోటికి తరలించవద్దని” ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం