ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అశోక్ లేలాండ్ - తెలంగాణ ఒప్పందం

భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో బాడీ బిల్డింగ్ యూనిట్ నెలకొల్పే ఒప్పందం కుదుర్చుకుంది. 500 కోట్లతో దశల వారీగా నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 1000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటి. రామారావు, విద్యుత్, షెడ్యూల్ కులాల శాఖల మంత్రి జి. జగదీష్ రెడ్డిల సమక్షంలో సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో సిఎం అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, అశోక్ లేలాండ్ కంపెనీ ఎం.డి వినోద్ కె దాసరి అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూ) మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఉత్పాదక రంగాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. పరిశ్రమలకు భూమి, ఇతర మౌళిక సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని రకాల అనుమతులను 15 రోజుల్లో మంజూరు చేసేందుకే టిఎస్ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ ఆర్.టీ.సికి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వాహనాలను ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమల నుండే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు సిఎం తెలిపారు. జీ.హెచ్.ఎం.సీకి అవసరమైన వాహనాలను తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల నుండే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో మాస్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం మెరుగుపరచడానికి అశోక్ లేలాండ్ కంపెనీ సలహాలు తీసుకోవాలని ట్రాన్స్ పోర్ట్, ఆర్.టీ.సి అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పట్టణ జనాభా 45 శాతం ఉందని వారికి సౌకర్యంగా ఉండేలా రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి తాము కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని సిఎం వివరించారు. తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్ కు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులు లక్షల్లో ఉన్నారని, భవిష్యత్తులో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల కమిషనర్ మాణిక్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టిఎస్ఐఐసి ఎండి ఇవి నర్సింహారెడ్డి, అశోక్ లేలాండ్ సీనియర్ వైస్ ప్రసిడెంట్స్ పి. వెంకట్రామన్, ఇ. హరిహర్, హిందూజా ఫౌండేషన్ సిఇవో డిఎం రెడ్డి, ఇడి రాజీవ్ సింఘ్వి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..