ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం

అభివృద్ధి దిశగా పయనిస్తున్న నూతన తెలంగాణ రాష్ట్రం దేశ విదేశాల ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన ఇండియన్ బ్యాంక్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ఈ మేరకు ఇండియన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సి.ఇ.ఓ ఎం.కె జైన్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును సోమవారం క్యాంపు కార్యాలయంలో తన బృందంతో కలిసారు. హెచ్.ఎమ్.డి.ఏ., జీ.హెచ్.ఎం.సీ పరిధిలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు ఆర్ధిక సహకారం ఋణం రూపంలో అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్న పట్టణాల పరిధిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను సిఎంకు బ్యాంకు ఎండీ వ్యక్తపరిచారు.
కాగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఇండియన్ బ్యాంకు ముందుకు రావడం శుభపరిణామమని, వారిని తాను ఆహ్వానిస్తున్నానని సిఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఇతర అభివృద్ధి, సేవారంగంలో వ్యవస్థల బలోపేతానికి ఇండియన్ బ్యాంకు అందించే ఆర్ధిక సహకారం దోహదం పడుతుందని సిఎం ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, అదనపు ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతికుమారి, టిఎస్ఐపాస్ ఎండీ నరసింహారెడ్డి, సమాచారశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.