ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు

చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవైభవాన్ని నూతన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి నెలకొల్పాలని సిఎం తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించారు. 


 ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీల్లో ఒకటిగా వెలగొందిన ఉస్మానియా యూనివర్సిటీ తన వైభవాన్ని రాను రాను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. అయితే పట్టుదలతో చారిత్రక ఘనతను తిరిగి నెలకొల్పేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకయినా వెనకాడబోదని స్పష్టం చేశారు. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కట్టుబడి వున్నదన్నారు. విశ్వ విద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా వైస్ చాన్సలర్లు నడుం బిగించాలన్నారు. మెస్ చార్జీలతో సహా హాస్టల్ వసతులు తదితర అన్ని మౌలిక సౌకర్యాలను పునరుద్దరించాలని సిఎం ఆదేశించారు. వలస పాలకుల ఏలుబడిలో కునారిల్లిన తెలంగాణలోని యూనివర్సిటీ విద్యను తిరిగి బలోపేతం చేయాల్సిన బాధ్యత వీసీలదేనని సిఎం స్పష్ఠం చేశారు.

సంబురాలు అంబరాన్నంటాలె:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరుపుకోనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవాల్సిన అవసరమున్నదని సిఎం స్పష్టం చేశారు. ఏప్రిల్ లో నిర్వహించనున్న ఉత్సవాలలో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించాలని వివరించారు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ ప్రాంగణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మానియాకు అనుబంధంగా వున్న వివిధ కళాశాలలతో పాటు హైద్రాబాద్ లో ఉన్న నిజాం, కోటి ఉమెన్స్ తదితర కాలేజీల్లో కూడా నిర్వహణకు సంబంధించి పండుగ వాతావరణం కనిపించాలన్నారు. కాకతీయ తదితర యూనివర్సిటీలోని విద్యార్థులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. యూనివర్సిటీలో విద్యనభ్యసించి దేశంలోనేకాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వివిధ రంగాలకు చెందిన వారందరినీ ఆహ్వానించి గౌరవించుకోవాలన్నారు. అన్ని యూనివర్సిటీల వీసీలతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి మరింత కసరత్తు చేయాలని కె. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీకి సిఎం ఆదేశించారు. కాగా సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఉత్సవాల నిర్వహణ విధి విధానాలెట్లుండాలె? ఎన్ని రోజులు నిర్వహించాలె? రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించడంతో సహా ఘనంగా నిర్వహించే దిశగా కార్యాచరణ ఎట్లుండాలె? దేశంలో గతంలో జరిగిన వివిధ యూనివర్సిటీలు శతాబ్ది ఉత్సవాలు జరిపితే వాటిని పరిశీలించాలని ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వాటి ఆధారంగా విధివిధానాలను ఖరారు చేసుకుని తనకో నివేదిక అందజేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కె. కేశవరావులను సిఎం ఆదేశించారు. త్వరలో మరోసారి సమావేశమై ఖచ్చితమైన తేదీలతో సహా ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన తుది నిర్ణయం ఖరారు కానున్నది.

సమీక్షా సమావేశంలో ఎంపీ కె. కేశవరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో పాటు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రామచంద్రరావు, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఆర్.సాయన్న, డా.బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ. ప్రొ.కె. సీతారామారావు, జెఎన్టీయు వీసీ. ప్రొ.ఎ. వేణుగోపాల్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ. ప్రొ. అల్తాప్ హుస్సేన్, తెలుగు విశ్వ విద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ, నల్సార్ యునివర్సిటీ వీసీ ప్రొ. ఫైజాన్ ముస్తఫా, ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, తెలంగాణ యునివర్శిటీ వీసీ పి. సాంబయ్య, జెఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ ప్రొ. కవితా దర్యాని రావు, సిఎంవో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు