ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఋణము అంటే ఏమిటి? అవి ఎన్ని?



ఋణము అంటే మనము బాకీ పడ్డ డబ్బులు కావు . దైవకము గా ఆద్యాత్మికముగా ఋణము అంటే మనము జీవితములో బదులు చేయవల్సిన కార్యములు అని అర్ధము .అవి మూడు ..

త్రిఋణాలు అనగా మనిషికి ఈ భూమి మీద జన్మనిచ్చిన వారికి అతను మూడు విధాలుగ ఋణపడి ఉంటాడు. ఈ ఋణములను అతను తన జీవిత కాలంలొ తీర్చుకోవలసి ఉంటుంది. అవి
1) దైవ ఋణములు,
2) పితృ ఋణములు,
3) ఋషి ఋణములు.

ఆశ్రమ ధర్మాలు అనగా మనిషి జన్మ తంతు ప్రారంభమయినప్పటి నుండి పరమపదించేవరకు మనిషి వివిధ వయసులలో చెయ్యవలసిన కర్మలే.

దైవ ఋణాలు:
మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తేర్చుకోవాలి! యజ్ఞ యాగాదులు నిర్వహించడము దైవఋణములు తీర్చుకోవడనికి ఒక త్రోవగా చెప్పడమయినది. యజ్ఞ తంతు లో వైధిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అస్విని దేవతలు మొదలయినవారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకాలయిన ద్రవ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండలిలొ అగ్నికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి భూతబలులు ఇచ్చి దేవతలకు ఆహారముగ సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ తంతు లో తోటి జనులకు విందు భోజనములు నిర్వహించాలన్నమాట.

*పితృ ఋణములు:*
భౌతికంగా మనిషి కి జన్మనిచ్చిన జనకులకు, వారికి జన్మనిచ్చిన వారి పితృలకు...ప్రతి మనిషి ఋణపడి ఉంటాడనేది పితృ ఋణ సిద్ధాంతానికి ప్రాతిపదిక కావొచ్చు. ఈ పితృ ఋణాలు భారతీయులు చక్కగా తీర్చు కుంటారు. అది ఎలానంటె ప్రధానంగా పిల్లల్ని కనడం ద్వారా! పిల్లల్ని సాంప్రదాయబద్ధంగా పెంచడం ద్వార!మన సాంప్రదాయములలొ వివహం ప్రతి మనిషి జీవితంలొ ఒక ప్రధానమయిన తంతు గా నిర్వహించబడుతుంది. "ధర్మ ప్రజా సంపత్యర్ధం రతి సుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహె"ఈ వాక్యానికి అర్ధం ఏమిటంటె ధర్మాన్ని కాపాడడానికి, పిల్లల్ని కనడానికి, రతి సుఖాన్ని పొందడానికి భార్య చేయిని పట్టవలెను."ప్రజయాహి మనుష్యా పూర్నాః" అనగా పిల్లల్ని కనడం వల్లనె మనిషి జన్మానికి పూర్ణత్వము లభిస్తుంది."ఆచార్యాయ ప్రియమ్ ధనమహ్రుత్య ప్రజాతమ్తుమ్ మవ్యవత్సెత్సిహ్" అనగా బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి మారడానికి గురువుకు తగిన దక్షిణ సమర్పించుకొని ఆయన అనుజ్ఞ స్వీకరించి వివాహం చేసుకోవాలని చెప్పబడినది. ఇక్కడ విషేషమేమిటంటే మనిషి తన యొక్క తన పూర్వికుల యొక్క వంశము నిర్మూలనము కాకుండా వుండడనికి తన ధర్మ నిర్వహణలో భాగంగా వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించి పిల్లల్ని పొంది వారిని పెంచి పోషించడం చెయ్యవలెను. ఈ విధంగా పితృ ఋణాన్ని తేర్చుకోవలెను.

ఋషి ఋణములు:
ఋషి ఋణములు అనగా సన్యాసులకు ఋణములు అని కాదు. ఋషులు అనగా మనకు జ్ఞ్నాన సంపదను అందించిన మన పూర్వ గురువులు. మనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వేదములు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు - రామాయణ, భారతాలు, ఉపనిషత్తులు, శిక్ష, నిరుక్తి, వ్యాకరణము, యోగ, మొదలయిన జ్ఞాన సంపదను మనకు అందించిన దైవంశ సంభూతులయిన మహా పురుషులే ఋషులు. వీరికి మనము అనగా హిందువులు ప్రత్యేకంగా ఋణపడి ఉంటారు. పైన ఉదహరించిన శాస్త్రల్ని అభ్యసించడం ద్వారను జ్ఞ్నాన సముపార్జన చెయ్యడం ద్వారాను మరియు పర్వ దినాల్లో బ్రహ్మచర్యం , ఉపవాసము పాటించడం ద్వారాను హిందువులు ఋషులకు చెల్లించాల్సిన ఋణాల్ని తీర్చుకోవలెను. మనిషి తన ఈ జన్మ లో ఈ మూడు ఋణాల్ని తీర్చుకోవడం ప్రధానకర్తవ్యం అని తెలుసుకోవలెను.

వేదాల్లో పుత్రుని యొక్క గొప్పతనము అనేక విధాలుగా వివరించబడింది. పుత్రుని ముఖము చూచినంతనే మానవుడు పితృ ఋణము నుండి విముక్తి పొందును. మనవడి శరీర స్పర్శ వలన పితృ ఋణము, దేవ ఋణము, ముని ఋణము... ఈ మూడు ఋణాలు వల్ల విముక్తి కలుగును. పుత్ర, పౌత్రులచే భయంకరమైన యమలోకమును దాటి స్వర్గమునకు వెళ్ళు మార్గము కనిపించును.

సేకరణ:సొంటేల ధనుంజయ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.