ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోక్షం స్వర్గం

మోక్షం అంటే భగవంతుని చేరడం కాదు. ఆయనొక మనిషిలా ఎక్కడో స్వర్గంలో ఉంటాడు. ఆయనను చేరుకుంటే మనకు మోక్షం కలుగుతుందని అనాది నుండి మనిషి భావన. శక్తిహీనమైన శరీరం, మనస్సు ఆ స్థాయి నుండి అంచెలంచెలుగా శక్తిని పెంచుకుని, రెండూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని 100% కలిగి ఉండడమే మోక్షం.

భగవంతుడు నిరాకారుడు. ఆయన ఒక శక్తి. ఆ శక్తికి ప్రేమ,  సహనం, ఓర్పు, దయ, జాలి,  శాంతి మొదలగు లక్షణాలు ఉన్నాయి.  ఆలాగే ప్రతి ప్రాణిలో కూడా ఈ లక్షణాలుంటాయి. ఈ లక్షణాలను వ్యక్తి కోల్పోవడం వలన సామాన్యుడయ్యాడు. అదే వ్యక్తి తిరిగి ఆ లక్షణాలను పూర్తి స్థాయిలో పెంచుకొని జీవించడమే మోక్షం.

ఈ లక్షణాలు పరిపూర్ణంగా పెరిగిన వ్యక్తి, దేహంతో ఉన్నపుడు చేసే ప్రతి పని విజయాన్ని పొందుతుంది. ఆ విజయమే మోక్షం. ప్రతి విషయంలోనూ స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆ అవగాహనే మోక్షం. కోరికలను అనుభవించకున్నా, వాటి వలన కలిగే తృప్తిని అనంతంగా కలిగి ఉంటాడు. అదే మోక్షం. చుట్టూ అనేక సమస్యలు చుట్టిముట్టి ఉన్నా ఏమాత్రం చలించకుండా ఉత్సాహాన్ని , ఉల్లాసాన్శి కలిగి ఉంటాడు. అదే నిజమైన మోక్షం.

భగవంతుడు ఎలా నిరాకారంగా ఉండి, పై లక్షణాలు మాత్రమే కలిగి ఉన్నాడో అలాగే వ్యక్తి దేహంలోని ఆత్మ కూడా నిరాకారమే. ఆ ఆత్మకు కూడా పై లక్షణాలు ఉన్నాయి. అవి పరిమితంగా ఉన్నాయి. అందుకే భగవంతునికి ఉన్న సామర్థ్యాలు అంత అధికంగా తనలో లేకపోయినా, ఉన్న పరిమిత సామర్థ్యంతో అన్ని పనులూ చేయగలడు. విజయాన్ని పొందగలడు. అయితే అదే వ్యక్తి సాధన ద్వారా గాని, ఇతర ఏ పద్దతుల ద్వారా గాని ఆ లక్షణాల సామర్థ్యాన్ని పెంచుకొని ఉన్నట్లైతే, మరణించాక ఆ ఆత్మ భగవంతుని సమమైన స్థితి కలిగి ఉన్నందున శరీరం నుండి వేరై ఆ శక్తిలో ఒక భాగమైహకలిసి పోతుంది. దీనినే మోక్షం అంటారు.... సర్వేజనాసుఖినోభవతుః

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.