ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమ్మ మెరిసే మేఘం.. నాన్న నీలాకాశం.

కష్టాన్ని కళ్ల కింద దాచిపెట్టి.. సంతోషాన్ని చేతి నిండా పంచిపెట్టే విధాత నాన్న! తన కోసం ఏదీ దాచుకోవాలని అనుకోనివాడు.. త్యాగాలకు ప్రతిరూపం నాన్న! కుటుంబం కోసం తన సర్వం ధారపోసే వాడు నాన్న.. ఎంత చేసినా నాన్న అణుమాత్రంగానే ఎందుకు మిగిలిపోతున్నాడు? ఆయన మనస్సు ఎందుకు అర్థం కాదు? అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న...అమ్మ దీపంలా వెలగాలంటే.. వత్తిలా నాన్న ఉండాల్సిందే.. ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి త్యాగాల గుర్తు. అమ్మ ప్రేమ కంటి ముందుంటే.. నాన్న ప్రేమ మాత్రం గుండె లోతుల్లో ఉంటుంది. నాన్న ఏది చేసినా కుటుంబం కోసమే.. పిల్లల అభివృద్ధి కోసమే.. తన పిల్లలకు ఆయనే రోల్ మోడల్.అమ్మ మెరిసే మేఘం.. నాన్న నీలాకాశం.. నాన్నను ఎప్పుడూ మనం ఒకే కోణంలో చూస్తాం.. గంభీరంగా కనిపించే వ్యక్తిలానే చూస్తాం.. కానీ నాణానికి రెండో వైపు నాన్నని అర్థం చేసుకోవాలంటే ముందు మనకంటూ అర్థం చేసుకునే మనసు ఉండాలి..పిల్లలు యవ్వనానికి వచ్చే సరికి తండ్రికి బాధ్యతలు పెరిగిపోతాయి. కొడుకును బాగా చదివించాలి. కూతుర్ని ఓ మంచి అల్లుడి చేతిలో పెట్టాలనే తాపత్రయం ఉంటుంది.. అందుకే కొన్ని సార్లు ఆయన మనసు మనకు అంత సులువుగా అర్థం కాదు. అంత లోతైనది తండ్రి మనసు. తల్లి ప్రేమను అందిస్తే.. నాన్న బాధ్యతను నేర్పిస్తాడు. చేయి పట్టుకుని దారి చూపుతాడు. దారి తప్పితే మందలిస్తాడు. మారుతున్న కాలంతో పాటు నాన్న అనే పదానికి ఇప్పుడు అర్థాలు మారిపోయాయి. నాన్నంటే మనసులో మాటను పంచుకునే నేస్తమయ్యాడు.
సృష్టిలో అమ్మ ప్రేమ ఎంత అద్భుతమైనదో.. నాన్న ప్రేమ కూడా అంతే మధురం. పిల్లల చేయి పట్టుకుని.. వాళ్లు సెటిల్ అయ్యేవరకూ నాన్న ఆ చేయి వదలడు. జీవితాన్ని ఇస్తాడు.. జీవితంలో ముందుకు నడిపిస్తాడు నాన్న. తను పడే కష్టం పిల్లలు పడకూడదనుకుంటాడు నాన్న. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు