ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమ్మ మెరిసే మేఘం.. నాన్న నీలాకాశం.

కష్టాన్ని కళ్ల కింద దాచిపెట్టి.. సంతోషాన్ని చేతి నిండా పంచిపెట్టే విధాత నాన్న! తన కోసం ఏదీ దాచుకోవాలని అనుకోనివాడు.. త్యాగాలకు ప్రతిరూపం నాన్న! కుటుంబం కోసం తన సర్వం ధారపోసే వాడు నాన్న.. ఎంత చేసినా నాన్న అణుమాత్రంగానే ఎందుకు మిగిలిపోతున్నాడు? ఆయన మనస్సు ఎందుకు అర్థం కాదు? అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న...అమ్మ దీపంలా వెలగాలంటే.. వత్తిలా నాన్న ఉండాల్సిందే.. ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి త్యాగాల గుర్తు. అమ్మ ప్రేమ కంటి ముందుంటే.. నాన్న ప్రేమ మాత్రం గుండె లోతుల్లో ఉంటుంది. నాన్న ఏది చేసినా కుటుంబం కోసమే.. పిల్లల అభివృద్ధి కోసమే.. తన పిల్లలకు ఆయనే రోల్ మోడల్.అమ్మ మెరిసే మేఘం.. నాన్న నీలాకాశం.. నాన్నను ఎప్పుడూ మనం ఒకే కోణంలో చూస్తాం.. గంభీరంగా కనిపించే వ్యక్తిలానే చూస్తాం.. కానీ నాణానికి రెండో వైపు నాన్నని అర్థం చేసుకోవాలంటే ముందు మనకంటూ అర్థం చేసుకునే మనసు ఉండాలి..పిల్లలు యవ్వనానికి వచ్చే సరికి తండ్రికి బాధ్యతలు పెరిగిపోతాయి. కొడుకును బాగా చదివించాలి. కూతుర్ని ఓ మంచి అల్లుడి చేతిలో పెట్టాలనే తాపత్రయం ఉంటుంది.. అందుకే కొన్ని సార్లు ఆయన మనసు మనకు అంత సులువుగా అర్థం కాదు. అంత లోతైనది తండ్రి మనసు. తల్లి ప్రేమను అందిస్తే.. నాన్న బాధ్యతను నేర్పిస్తాడు. చేయి పట్టుకుని దారి చూపుతాడు. దారి తప్పితే మందలిస్తాడు. మారుతున్న కాలంతో పాటు నాన్న అనే పదానికి ఇప్పుడు అర్థాలు మారిపోయాయి. నాన్నంటే మనసులో మాటను పంచుకునే నేస్తమయ్యాడు.
సృష్టిలో అమ్మ ప్రేమ ఎంత అద్భుతమైనదో.. నాన్న ప్రేమ కూడా అంతే మధురం. పిల్లల చేయి పట్టుకుని.. వాళ్లు సెటిల్ అయ్యేవరకూ నాన్న ఆ చేయి వదలడు. జీవితాన్ని ఇస్తాడు.. జీవితంలో ముందుకు నడిపిస్తాడు నాన్న. తను పడే కష్టం పిల్లలు పడకూడదనుకుంటాడు నాన్న. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం