ప్రముఖ కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సి. నారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఘన నివాళి అర్పించారు. మంగళవారం మద్యాహ్నం నగరంలోని సినారె ఇంటికి వెళ్లి ఆయన పార్దీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి, నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులందరితో ప్రత్యేకంగా మాట్లాడారు. సినారెను బావి తరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం తరుఫున అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి