ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొత్త రాష్ట్రపతి గా ఆదివాసీ మహిళా?



 ప్రధాని మోడీ చే ఆమోదించబడి ,  ప్రణవ ముఖర్జీ తరువాత మన రాష్ట్రపతి గా  మహిళ ద్రౌపది ముర్ము కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . 25th July 2017 తో ముగియనున్న ప్రణబ్ ముఖర్జీ term తరువాత ద్రౌపది ముర్ము ఆ పదవిని చేపట్టబోతున్నారు.
L K అద్వానీ, మురళీ మనోహర్ జోషి, చివరికి రజనీకాంత్ వంటి వారి పేర్లు వినిపించిన , సీనియర్ నాయకులు తో అనేక సార్లు చర్చలు జరిపినా మోడీ తన మార్కు రాజకీయంతో ద్రౌపది ముర్ము పేరు తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని భావిస్తున్నారు
ప్రస్తుతం మేడమ్ ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉంటున్న రాజకీయ నిపుణురాలు. భారతదేశ  మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి గా రాబోతున్న  మహిళ. తండ్రి  "బిరంచి నారాయణ తుడు". ఒరిస్సా లో పుట్టి పెరిగిన ఈమె అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

2007 వ సంవత్సరంలో ఒరిస్సా శాసనసభ ద్రౌపది ముర్ము కి best MLA అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈమె 'నీలకంఠ' అవార్డు గ్రహీత కూడా. 1997 లో మొట్టమొదటి సారిగా కౌన్సిలర్ గా ఎన్నికైనా, తర్వాత రాయ్ రణపూర్ NAC కి వైస్ చైర్మన్ అయ్యారు. తరువాత రాయ్ రణపూర్,  ఒరిస్సా నియోజకవర్గాలనుండి MLA గా ఎన్నికైన గానీ, తరువాత రాష్ట్ర మంత్రి గా కూడా పనిచేసారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు