ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్ష

ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడానికి ఎన్ని నిధులైనా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నిమ్స్ వరకు ఆసుపత్రికి ఏమి చేయాలనే విషయంలో సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు
ప్రభుత్వ వైద్యశాలలు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడానికి, ఆసుపత్రుల్లో పడకలు, విద్యుత్, టాయిలెట్లు, బెడ్ షీట్లు సరైన, బెడ్ షీట్లను ఎప్పటికప్పుడు మార్చాలని, వాటిని శుభ్రం చేయడానికి మెకనైజ్డ్ లాండ్రీ సిస్టమ్ ....హైదరాబాద్ లో ప్రస్తుతమున్న గాంధీ, ఉస్మానియాలకు తోడుగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించాలని, అందుకు అనువైన స్థలాలు ఎంపిక చేయాలని....
ఉప్పల్ - ఎల్ బి నగర్ ప్రాంతాల్లో ఒకటి, మల్కాజిగిరి - కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఒకటి, కుత్బుల్లాపూర్ - కూకట్ పల్లి ప్రాంతాల్లో ఒకటి, శేరిలింగంపల్లి - రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పెద్ద ఆసుపత్రులు నిర్మించాలన్నారు.
ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యంలో కూడా మెరుగైన సేవలు అందించడానికి ఏమికావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్యశాలలకు ఏమి కావాలంటే అది ఇస్తామని, అంతిమంగా ప్రైవేటు ఆసుపత్రులకన్నా మెరుగ్గా అవి తయారు కావాలన్నారు.


108, 104 సేవలను మరింత బలోపేతం చేయడానికి అనువైన విధానం రూపొందించాలని, హైవేల మీద పెట్రోలింగ్ చేసే వాహనాలతో వాహనాలను కూడ అనుసంధానం చేయాలని చెప్పారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో పోలీస్, ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని డిజిపి అనురాగ్ శర్మకు చెప్పారు 

 బడ్జెట్ సమీక్షల్లో భాగంగా శనివారం ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.. రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తివారి, ఆర్థిక శాఖ కార్యదర్శులు రామకృష్ణ రావు, శివశంకర్, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.