ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్ష

ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడానికి ఎన్ని నిధులైనా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నిమ్స్ వరకు ఆసుపత్రికి ఏమి చేయాలనే విషయంలో సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు
ప్రభుత్వ వైద్యశాలలు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడానికి, ఆసుపత్రుల్లో పడకలు, విద్యుత్, టాయిలెట్లు, బెడ్ షీట్లు సరైన, బెడ్ షీట్లను ఎప్పటికప్పుడు మార్చాలని, వాటిని శుభ్రం చేయడానికి మెకనైజ్డ్ లాండ్రీ సిస్టమ్ ....హైదరాబాద్ లో ప్రస్తుతమున్న గాంధీ, ఉస్మానియాలకు తోడుగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించాలని, అందుకు అనువైన స్థలాలు ఎంపిక చేయాలని....
ఉప్పల్ - ఎల్ బి నగర్ ప్రాంతాల్లో ఒకటి, మల్కాజిగిరి - కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఒకటి, కుత్బుల్లాపూర్ - కూకట్ పల్లి ప్రాంతాల్లో ఒకటి, శేరిలింగంపల్లి - రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పెద్ద ఆసుపత్రులు నిర్మించాలన్నారు.
ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యంలో కూడా మెరుగైన సేవలు అందించడానికి ఏమికావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్యశాలలకు ఏమి కావాలంటే అది ఇస్తామని, అంతిమంగా ప్రైవేటు ఆసుపత్రులకన్నా మెరుగ్గా అవి తయారు కావాలన్నారు.


108, 104 సేవలను మరింత బలోపేతం చేయడానికి అనువైన విధానం రూపొందించాలని, హైవేల మీద పెట్రోలింగ్ చేసే వాహనాలతో వాహనాలను కూడ అనుసంధానం చేయాలని చెప్పారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో పోలీస్, ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని డిజిపి అనురాగ్ శర్మకు చెప్పారు 

 బడ్జెట్ సమీక్షల్లో భాగంగా శనివారం ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.. రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తివారి, ఆర్థిక శాఖ కార్యదర్శులు రామకృష్ణ రావు, శివశంకర్, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..