ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వంతెనలు, టన్నెళ్లు, పంపుహౌజుల నిర్మాణం


తెలంగాణ రాష్ట్రంలో వంతెనలు, టన్నెళ్లు, పంపుహౌజుల నిర్మాణం తక్కువ వ్యయంలో, తక్కువ సమయంలో పూర్తి చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చైనాకు చెందిన నిర్మాణ సంస్థ అన్జు ప్రతినిధులు తెలిపారు. అన్జు ఇన్ఫ్రా టెక్ వైస్ ప్రసిడెంట్ హొస్సేన్ ఖాజీ (hussei khazaei), డైరెక్టర్ యోగేష్ వా, కంట్రీ హెడ్ మనోజ్ గాంధి, పిఆర్వో ఆర్. స్వాతిశ్రీ తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. గతంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు నిర్మాణానికి, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజుల నిర్మాణానికి చైనా కంపెనీలు ముందుకు వచ్చాయి.
వాటి డిజైన్లను చైనా బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ కార్పొరేషన్, చైనా కమ్యూనికేషన్స్ అండ్ కన్స్ స్ట్రక్షన్ కంపెనీలు రూపొందించాయి. దుర్గం చెరువుపై నాలుగు లేన్ల రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించారు. మెడిటేషన్ మోడల్, క్యాండిల్ ఫ్లవర్ మోడల్, చెట్టు ఆకుల మోడల్, లోటస్ ఫ్లవర్ ఆకారాలతో డిజైన్లు తయారు చేశారు. 11 అంచెలుగా నిర్మాణం చేపడతామని, 25 నెలల్లో పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. మూసీ నదిపై 41 కిలోమీటర్ల పొడవున ఈస్ట్ - వెస్ట్ కారిడార్ నిర్మిస్తామన్నారు. 25 కిలో మీటర్ల మేర స్కైవే, 15 కిలోమీటర్ల మేర రోడ్ వే ఉంటుందన్నారు. ఈ నిర్మాణాన్ని 40 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వీటి డిజైన్లను కూడా సిఎంకు చూపించారు.
ఈ రెండు ప్రాజెక్టుల్లో దాదాపు 2500 మంది అవసరం అవుతారని, ఎక్కువ మందిని స్థానికులనే తీసుకుంటామని చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెళ్లు, పంపుహౌజు డిజైన్లు కూడా ఫిబ్రవరి 20 నాటికి అందిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు చాలా వేగంగా కట్టాల్సి వుందని, అందుకు సంబంధించిన వ్యూహం తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. త్వరలోనే డిజైన్లపై నిర్ణయం తీసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం