ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పర్యాటక కేంద్రంగా సోమశిల ప్రాజెక్టు



 సోమశిల నుంచి అక్కమహాదేవి గుహలను సందర్శించి, తెలంగాణ తీరంలోని శ్రీశైలం డ్యామ్‌వరకు బోటింగ్ సౌకర్యం కల్పించడంపై టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టూరిజంశాఖ అధికారులు కూడా సంతోషం వ్యక్తంచేశారు. సోమశిలప్రాంతంలో టూరిజం సదుపాయాలను పెంచిన తర్వాత పర్యాటకుల నుంచి వస్తున్న స్పందనలను, సదుపాయాలను మంత్రులు సమీక్షించారు. రాష్ట్ర పరిధిలోని సోమశిల ప్రాంతమంతా ఆహ్లాదంగా పర్యటించేవిధంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అక్కమహాదేవి గుహలు, పర్యావరణ టూరిజం పరిధిలోకి వస్తున్నందున అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
సోమశిల అటవీప్రాంతం పులలు సంరక్షణ ప్రాంతంగా కూడా ఉన్నదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కమహాదేవిగుహల సందర్శనకు వచ్చేవారి నుంచి తీసుకునే రుసుములో అటవీశాఖకు కూడా కొంత చెల్లించాలని చర్చ వచ్చింది. ఆదాయవనరులు పెరుగుతాయని , అటవీ పరిరక్షణ, నీటిపారుదల, దేవాదాయశాఖ చట్టాలను పరిగణనలోకి తీసుకొని శాఖల నుంచి అనుమతులు తీసుకున్నామని, ఏకకాలంలో ఈ ప్రాంతంలో పర్యావరణ, యాత్రా, జలవిహారం వంటి ఆహ్లాదకరమైన అంశాలన్నీ ఉన్నందునే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు