ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పర్యాటక కేంద్రంగా సోమశిల ప్రాజెక్టు



 సోమశిల నుంచి అక్కమహాదేవి గుహలను సందర్శించి, తెలంగాణ తీరంలోని శ్రీశైలం డ్యామ్‌వరకు బోటింగ్ సౌకర్యం కల్పించడంపై టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టూరిజంశాఖ అధికారులు కూడా సంతోషం వ్యక్తంచేశారు. సోమశిలప్రాంతంలో టూరిజం సదుపాయాలను పెంచిన తర్వాత పర్యాటకుల నుంచి వస్తున్న స్పందనలను, సదుపాయాలను మంత్రులు సమీక్షించారు. రాష్ట్ర పరిధిలోని సోమశిల ప్రాంతమంతా ఆహ్లాదంగా పర్యటించేవిధంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అక్కమహాదేవి గుహలు, పర్యావరణ టూరిజం పరిధిలోకి వస్తున్నందున అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
సోమశిల అటవీప్రాంతం పులలు సంరక్షణ ప్రాంతంగా కూడా ఉన్నదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కమహాదేవిగుహల సందర్శనకు వచ్చేవారి నుంచి తీసుకునే రుసుములో అటవీశాఖకు కూడా కొంత చెల్లించాలని చర్చ వచ్చింది. ఆదాయవనరులు పెరుగుతాయని , అటవీ పరిరక్షణ, నీటిపారుదల, దేవాదాయశాఖ చట్టాలను పరిగణనలోకి తీసుకొని శాఖల నుంచి అనుమతులు తీసుకున్నామని, ఏకకాలంలో ఈ ప్రాంతంలో పర్యావరణ, యాత్రా, జలవిహారం వంటి ఆహ్లాదకరమైన అంశాలన్నీ ఉన్నందునే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.