ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హైదరాబాద్ లో ఫార్మాసిటీ

హైదరాబాద్ లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అవసరమయ్యే సమగ్ర నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దాదాపు 12వేల ఎకారాల్లో ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్య సమస్యలు రాకుండ పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యర్థాల ట్రీట్మెంట్ సరిగా జరగడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉండే అమెరికా, జపాన్, యురప్ దేశాలలో పర్యటించి అక్కడ వ్యర్థాల సమగ్ర నిర్వాహణ కోసం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. సిఎంఓ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతకుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్ లో నెలకొల్పే ఫార్మాసిటీపై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాసిటీ నూటికి నూరు శాతం ప్రమాద రహితంగా, వ్యర్థాలు బయటికి వచ్చే వీలు లేకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో నగరంలో నెలకొల్పిన ఫార్మా పరిశ్రమల వల్ల కొన్ని ప్రాంతాలు పూర్తిగా కలుషితం అయిపోయ్యాయని ఈ పరిస్థితి పునరావృతం కావద్దని సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు