ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఉదయ్ పథకంలో తెలంగాణ రాష్ట్రం

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ తో కే సీ ఆర్   విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కమ్)ను నష్టాల ఊబి నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ (Ujwal DISCOM Assurance Yojana) పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. డిస్కమ్ లకు ఉన్న అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. డిస్కమ్ ల అప్పులు తీర్చడానికి నిధులు సమీకరించుకోవడానికి ఎఫ్.ఆర్.బి.ఎమ్. మినహాయింపులు ఇవ్వడం సానుకూల అంశమని సిఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఉదయ్ పథకంలో చేరాలని సిఎంను కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలగా స్పందించారు. ఉదయ్ లో చేరడం ద్వారా జరిగే పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దీన్ దయాల్ పథకంలో ఎక్కువ నిధులు ఇవ్వడంతో పాటు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారు. తెలంగాణ ఉదయ్ పథకంలో చేరాలని నిర్ణయించినందువల్ల కేంద్ర, రాష్ట్ర అధికారులు మరోసారి సమావేశమై ఒప్పందంపై సంతకాలు చే...

బ్రిగ్జిట్

ఈయూలోని ఇతర దేశాల నుంచి వలసలు పెరిగి తమ ఉపాధికి ఎసరు పెడుతున్నారని బ్రిటన్‌-లోని అత్యధిక ప్రజలు అసంతృప్తిని వెల్లడించారు. 51.9 శాతం మంది ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని కోరుకుంటే 48.1 శాతం మంది ప్రజలు ఈయూలోనే కొనసాగాలని కోరుకున్నారు. బ్రిటన్‌ ప్రస్తుత జనాభాలో 21.5 లక్షల మంది ప్రజలు వలసల వచ్చిన వారే ఉన్నారు. దీంతో బ్రిటన్‌-లో జీతాల పెరుగుదల వృద్ధి రేటు పడిపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి ఎవరైనా బ్రిటన్ చేరుకుని ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఈ వెసులుబాటులు కారణంగా ఎక్కువ నిధులు వీరి ఆరోగ్య సంరక్షణకు ఖర్చు అవుతున్నాయనేది బ్రిటన్ వాసుల ప్రధాన ఆరోపన. వలస వచ్చిన వారి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం బ్రిటన్ అనవసర ఖర్చులు చేస్తుందని.. అక్కడ అధికార పార్టీలోని పలువురు ప్రముఖులు కూడా ఆరోపించడమే బ్రిగ్జిట్-కు కారణమయ్యింది.డేవిడ్ కామెరాన్ యూనియన్ లో కొనసాగాలని ప్రయతించాడు అందుకు విరుద్దంగా రెఫరెండం రావడం తో కామెరాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు .

బిసిల సంక్షేమం :తెలంగాణ సర్కారు

వెనకబడిన తరగతులకు ( బిసి ) చెందిన కులాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు , వారి అభ్యున్నతికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె . చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు . బిసిలలో ఏఏ కులాలకు చెందిన వారి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి ? వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు . బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ , సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులతో క్యాంపు కార్యాలయంలో   ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు . మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల వల్ల , కొత్తగా నిర్మించే రిజర్వాయర్ల వల్ల మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరుగుతుందని , దీని వల్ల చేపలు పట్టుకుని జీవించే వారికి పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుందని చెప్పారు . ఇదే విధంగా మిగతా కులాల జీవనోపాధికి మార్గాలు అన్వేషించాలని , ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయం చేయాలో నిర్ణయించాలని చెప్పారు . బిసిలలో కూడా అన్ని కులాల ఆర్థిక పర...

ఎ.పి. భవన్ తెలంగాణకు అప్పగించాలి : కె. చంద్రశేఖర్ రావు

న్యూఢిల్లీలో ఎ.పి. భవన్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ స్థలం హైదరాబాద్ రాష్ట్రానికి చెందింది కాబట్టి దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు గురువారం లేఖ రాశారు. దేశ రాజధానిలో త్వరలోనే ఓ పద్ధతిగా, ప్రణాళికా బద్ధంగా తెలంగాణ భవన్ నిర్మించాలనుకుంటున్నామని, కాబట్టి సదరు స్థలాన్ని తమకు అప్పగించే విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని సిఎ ం ఈ లేఖలో కోరారు. ‘‘హైదరాబాద్ కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936 లో మూడు బిట్లుగా ఢిల్లీలో ఉన్న 18.18 ఎకరాల స్థలాన్ని విదేశీ, రాజకీయ వ్యవహారాల శాఖ నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఎపి భవన్ ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ హౌజ్ ను కేంద్రం తీసుకుంది. పటౌడి హౌజ్లోని 7.56 ఎకరాలను, నర్సింగ్ ఇన్ స్టిట్యూట్ లోని 1.21 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారు. ఆరవ నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైద...

టిఎస్ఆర్టీ బలోపేతానికి ప్రభుత్వ చర్యలు

తెలంగాణ ఆర్టీసికి తక్షణ సాయంగా రూ. 300 కోట్లు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ. 350 కోట్ల రుణాన్ని ఆర్టీసికి ఇప్పించాలని అధికారులకు సూచించారు. టిఎస్ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందున అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి సంస్థను లాభాల బాట పట్టించాలని ఆర్టీసీపై మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండి జెవి రమణారావు తదితరులతో గురువారం క్యాంపు కార్యాల యంలో సిఎం సమీక్ష నిర్వహించారు.  బస్సు పాసుల కోసం ఇస్తున్న రూ. 500 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని దీనికి సంబంధించిన డబ్బులను వెంటవెంటనే విడుదల చేయాలని , జిహెచ్ఎంసి రూ. 190 కోట్ల వరకు భరిస్తున్నదని, ఈ రెండు చర్యల వల్ల ఆర్టీసికి ఏటా వచ్చే రూ. 700 కోట్ల నష్టం పూడుతుందని సిఎం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసిని లాభాల బాట పట్టించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ లకు ఆర్థిక చేయూత

ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ రంగం సంస్థలను కాపాడడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడితే అంతిమంగా ప్రజలే బాగుపడతారని , ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, విద్యుత్ అంశాలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం సిఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యానారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, జెన్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు, ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఆర్టీసీ ఎండి రమణారావు తదితరులు పాల్గొన్నారు.    ఈ సమీక్షలో ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంస్థల ఆదాయ-వ్యయాలు, వస్తున్న నష్టాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడవం వల్ల ఆర్టీసీ, విద్యుత్ సంస్...

తెలంగాణ ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వ చర్యలు

1. గత ప్రభుత్వాలు ఆర్టీసీని అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆర్టీసీ నష్టాలు అంతకంతకూ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆర్టీసీకి రూ.2,275 కోట్ల అప్పు ఉంది. ప్రతీ నెలా నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసిని నడపడానికి చివరికి ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.180 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి నుంచి కాపాడడం కోసం ఆర్టీసికి బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతీ నెల రూ.75 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయాన్ని ఆర్టీసికి అందిస్తున్నారు. 2. అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్ ఆర్టీసికి గుదిబండలా మారింది. ఎక్కువ నష్టాలు దీనివల్ల వస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించడానికి హైదరాబాద్ నగరంలో తిరిగే బస్సుల ద్వారా వచ్చే నష్టాన్ని క్రాస్ సబ్సిడి ద్వారా జిహెచ్ఎంసి భరించే విధాన నిర్ణయం తీసుకున్నారు. 3. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. 1100 బస్సులు పూర్తిగా పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి కొనడంతో పాటు మరో 100 బస్సులు కొత్తవి కొనాల్సి వుంది. మొత్తంగా 1200 బస్సులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్ల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. 4. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పట...