ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమం

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని ,తమిళనాడు న్యూస్ చానెల్స్  జయలలిత చనిపోయారని న్యూస్ ఇస్తున్నారు కానీ అపోలో హాస్పిటల్ నుంచి ఎటువంటి తాజా సమాచారం అందలేదు . అపోలో వైద్యులు  ఈ విషయాన్నీ ఖండించారు . ఎక్మో(ECMO) మెషిన్.. ‘ఎక్స్‌ట్రా కార్పోరల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌’.. ఇప్పుడు జయలలిత ప్రాణాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి.  గంటలుగా తనను ఈ యంత్రంపైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంతకూ ఎక్మో పని తీరు ఏంటి..? దానిపై ఉంచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? అన్న ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి.

ఎక్మో ఏం చేస్తుంది అంటే…

గుండె, ఊపిరితిత్తుల స్థానంలో ఎక్మో పరికరం  పనిచేస్తుంది.  క్లిష్ట పరిస్థితులలో  వాటి బాధ్యతను ఎక్మో స్వీకరిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు పని చేస్తూనే వాటికి ఎక్మో సహాయకారిగా ఉండటం లేదా  పూర్తిగా గుండె, ఊపిరితిత్తులకు విశ్రాంతినిచ్చి ఆ బాధ్యతను ఎక్మో స్వీకరించడం జరుగుతుంది

మొదటి పద్ధతిలో గుండె, ఊపిరితిత్తులను పూర్తిగా నిలిపేస్తారు. యంత్రమే ఆక్సిజన్‌ హరించుకు పోయిన చెడు రక్తాన్ని స్వీకరించి, తిరిగి అదే మంచి రక్తాన్ని దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తుంది. ఇందులో రక్తాన్ని వెచ్చబరిచే బాధ్యత యంత్రానిదే. ఇందులో గుండె ఊపిరితిత్తుల పాత్ర ఉండదు. అవి విశ్రాంతి తీసుకొంటాయి. అవి మెరుగుపడ్డాక ఎక్మోకు సమాంతరంగా పని చేస్తాయి. చివరకు ఎక్మోను తొలగిస్తారు.

రెండో పద్ధతిలో ఎక్మో ఎనిమిది గంటల పాటు పని చేస్తుంది. అది విజయవంతమై గుండె, ఊపిరితిత్తులు మెరుగు పడితే ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులు, ఎక్మో సమాంతరంగా పని చేయిస్తారు. ఈ పద్ధతిలో యంత్రాన్ని 1-2 వారాలు పనిచేయించవచ్చు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.