ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రైవేట్ ఉద్యోగుల‌కు ఈపీఎఫ్‌వో శుభ‌వార్త‌


        దేశంలోని ప్రైవేటు ఉద్యోగుల‌కు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) శుభ‌వార్త చెప్పింది. ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వో ఈ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఉద్యోగి ఏ రోజైతే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతాడో అదే రోజు నుంచి పింఛ‌న్ మొదల‌వుతుంది. ఇది ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు నిజంగా ఒక వ‌రం లాంటిద‌ని ఈపీఎఫ్‌వో వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ప‌ద్ధ‌తి ఈ నెల 30 నుంచే అమ‌ల్లోకి రానుంద‌ని ఈపీఎఫ్‌వో వెల్ల‌డించింది. 


ఉద్యోగి ప‌ద‌వి విర‌మ‌ణ పొందిన త‌ర్వాత పింఛ‌న్ ప్ర‌క్రియ మొద‌లు కావాలంటే గ‌తంలో నెల‌ల త‌ర‌బ‌డి పెన్ష‌న్ ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. ఎంతో పేప‌ర్ వ‌ర్క్ ఉండేది. కానీ ఈ నెల 30 నుంచి ఇక ఆ ప‌రిస్థితి ఉండ‌దు. ఉద్యోగి రిటైర్ అయిన రోజు నుంచే ఆటోమేటిక్‌గా పెన్ష‌న్ మొద‌ల‌వుతుంది.  ‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.