ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పెద్ద నోట్ల రద్దు-ప్రజల ఇబ్బందులు

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని, ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం సమీక్ష నిర్వహించారు. లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు, మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా వుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏమి చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థికశాఖను ఆదేశించారు. సోమవారం క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చ జరిగేందుకు వీలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థికశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి కోరారు.

అయిదు గురు సభ్యులతో కమిటీ
రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించేందుకు, ఈ – పేమెంట్స్ వ్యవస్థను పెంపొందించేందుకు అవసరమైన విధానం రూపొందించడానికి అయిదుగురు సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు సురేష్ చంద్ర, శాంతికుమారి, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ లు కమిటీలో వున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..