ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎన్టీఆర్ రాజకీయాలలోకి ప్రవేశO ప్రస్తావన



ఎన్టీఆర్ తాను రాజకీయాలలోకి రానున్నట్టు తొలిసారిగా ప్రకటించింది 1980 సంవత్సరంలో. ఊటీలో 'సర్దార్ పాపారాయుడు' సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో ఒకనాడు, తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తనకు అరవై సంవత్సరాలు వయసు వచ్చాక రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఉందనీ, ఇన్నాళ్ళూ తనను ఆదరించిన ప్రజల ఋణం తీర్చుకోవాలని ఉందని అన్నారు. విషయం కాస్తా నోటా, నోటా పడి తెలుగు పత్రికలలోకి రాగానే తెలుగునాట తొలి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 
కాంగ్రెస్ వారి గుండెల్లో దడ మొదలయ్యింది. ఎన్టీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఆబాలగోపాలమూ సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలన అంతమయినట్టే అని భావించిన అధిష్టానం ఎన్టీఆర్ పై సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది. ఎన్టీఆర్ బాల్య స్నేహితుడైన భవనం వెంకట్రాంను ముఖ్యమంత్రిని చేసి, ఆయన ద్వారా ఎన్టీఆర్ ను మెత్త పరచేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఎన్టీఆర్ సినిమాలను సెన్సార్ బోర్డులో ఏదో ఒకరకంగా ఆపడం చేశారు. అటు సినీ రంగంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తారనే వార్త విన్న నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు పోటీ పడ్డారు. ఇదిలా సాగుతుండగా ఎన్టీఆర్ తన సినిమాలను తాను చేసుకుంటూ మరో వైపు రాష్ట్ర రాజకీయాలను పరిశీలించసాగారు.

చివరికి అనుకున్న సుముహూర్తం రానే వచ్చింది. 1982 మార్చి 21 అంటే 34 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున రామకృష్ణా స్టూడియోలోని మినీ ప్రివ్యూ థియేటర్లో జర్నలిస్టుల సమక్షంలో తన రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన చేశారు ఎన్టీఆర్. అంతే తర్వాత షూటింగ్ నిమిత్తం వెంటనే మద్రాస్ వెళ్ళిపోయారు.
సోర్స్ :టి డి పీ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..