ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టు

మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో జరిగిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ఒప్పందాలను, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులను పరిశీలించడానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసుకోవడానికి పరస్పర అంగీకారంతో ఒప్పందం కుదిరింది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ 1979 (తదుపరి నివేదిక 1980) పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ర్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికి బోర్డు సర్వ పర్యవేక్షణ సంస్థగా పనిచేస్తుంది.


1. లెండి ప్రాజెక్టు
2. ప్రాణహిత ప్రాజెక్టు (తమ్మిడిహట్టి బ్యారేజి), కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజి)
3.
పెన్ గంగపై రాజుపేట వద్ద బ్యారేజి
4.
పెన్ గంగపై చనాఖా-కొరాట మధ్య బ్యారేజి
5.
పెన్ గంగపై పంపరాడ్ వద్ద బ్యారేజి
6.
లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు
పై ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను బోర్డు పర్యవేక్షిస్తుంది. ఏవైనా సందేహాలు, అనుమానాలు, సమస్యలున్నా బోర్డు సామరస్యంగా పరిష్కరిస్తుంది. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను కూడా బోర్డు పరిగణలోకి తీసుకుంటుంది.

తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదరడం రెండు రాష్ర్ట్రాల చరిత్రలో మహత్తరమైన అధ్యాయమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ర్ట్రాలు వేరైనా అందరం మొదట భారతీయులమేనని, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ పూరిత వాతావరణంలో కాకుండా సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామని సిఎం స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.