ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తహసీల్దారు కార్యాలయానికి రూ.10 లక్షలు- 3 నుంచి ధరణి సేవలు

3 నుంచి ధరణి సేవలుతహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను వచ్చే నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఏకీకృత డిజిటల్‌ సేవల పోర్టల్‌ ‘ధరణి’ని అక్టోబరు 3న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో కార్యాలయానికి ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించింది. కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా బాధ్యతలను ఒక సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ధరణి’ సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేశారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోర్టల్‌ నిర్వహణ, ఇతర శాఖలకు అనుసంధానంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దయినప్పటికీ వారిని ఇంకా ఇతర శాఖలకు కేటాయించలేదు. వారికి ఇతర శాఖల్లో బాధ్యతలు అప్పగించే వరకు భూ సంబంధిత వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పథకాలు, సమాచార సేకరణకు వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్ట...

రేపటి నుంచి మూడు విదేశీ విమాన సేవలు

 కేంద్ర పౌర విమానయాన శాఖ  మంత్రి హర్దిప్ సింగ్ పూరి వెల్లడి • విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ు. • మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ దేశాలకు విదేశీ విమాన సేవలు. • అమెరికా రేప‌టి నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి నుంచి భార‌త్‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు అంగీక‌రించాయి. • జులై 18 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు మ‌ధ్య 28 విమానాల‌ను న‌డ‌ప‌నున్న ఎయిర్ ఫ్రాన్స్. • రేపటి నుంచి నుంచి జూలై 31 వ‌ర‌కు భార‌త్ – అమెరికా మ‌ధ్య‌ 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల‌ను న‌డుపేందుకు ఒప్పందం. • జర్మ‌నీతో కూడా విమాన స‌ర్వీసుల‌పై సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, “లుఫ్తాన్సా” ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వ‌చ్చిందన్న కేంద్రమంత్రి. • విదేశీ విమాన స‌ర్వీసుల‌ నిర్ణ‌యాన్ని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది

సామాజిక కార్యక్రమాలలో అధ్యాపకులు -సీఎం ప్రోత్సహం

విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం లాంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీ సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. ఇద్దరు తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని చెప్పారు. వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. హృదయ పూర్వకంగా అభినందించారు. ‘‘సదాశివయ్య గారు మీ గురించి అధికారులు బాగా చె...

అందరికి అందుబాటులో వైద్యం

వైద్యం అన్న‌ది స‌రైన స‌మ‌యంలో అంద‌క‌పోతే మ‌నిషి బ్ర‌త‌క‌డు. వైద్యం కోసం అప్పులుపాలు అయ్యే ప‌రిస్థితి ఏ మ‌నిషికి రాకూడ‌దు అనే ఉద్దేశ్యంతో సంవ‌త్స‌రానికి ఐదు ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తి కుటుంబాన్ని ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చామని - ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. .“

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టేందుకు టీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రైవేట్ ఆస్పత్రుల పై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్ కేటాయించి ..ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైనా సమస్య ను 9154170960 నెంబర్ కి వాట్సప్ చేయాలని  డైరెక్టర్ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు

గవర్నర్ తెలుగు భాషా పట్ల ఆశక్తి

మైసూరులోని భారతీయ భాషా సంస్థ దక్షిణ ప్రాంతీయ కేంద్రంలో తెలుగు భాషా బోధనలో శిక్షణ పొందుతున్న తెలుగేతర ఉపాధ్యాయులు ఈ రోజు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు . 17 మంది శిక్షణ పొందుతన్న అభ్యర్ధులు శిక్షణలో భాగంగా హైదరాబాదును సందర్శిస్తున్నారు . మూడు రోజుల పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పలు కార్యక్రమాలను నిర్వహించిన తరువాత గవర్నర్ను కలిశారు . తమిళనాడు , కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపాద్యాయులు   తెలుగు   లో పొందిన ప్రావీణ్యాన్ని చూసి గవర్నర్ ఆశ్యర్యపోయారు . తాను కూడా తెలుగు నెర్చుకుంటానని రేపటి నుంచే తనకు నేర్పడానికి ఏర్పాటు చేయవలసిందిగా తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ తెలుగు కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి . సత్తి రెడ్డి గారిని ఆదేశించారు . .