జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (మేటి) మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలో 70 మంది పారిశ్రామిక ప్రతినిధుల బృందం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి జపాన్ సహకారం వంటి అంశాలపై ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, సిటీ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, రాజధాని ప్రాంతానికి డేటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫాం, రాడార్ ద్వారా విపత్తుల నిరోధక వ్యవస్థ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు జపాన్ సహకారంపై చర్చలు జరిగాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి