ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాష్ట్రం పచ్చదనంతో కళకళ

రాష్ట్రంలోని రిజర్వు ఫారెస్టు అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని,ప్రతి ఇంచు అటవీ భూమిని సమర్దవంతంగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అధికారులకు సూచించారు.
సోమవారం సచివాలయంలో అటవీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, అటవీ శాఖ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకు అటవీ భూములు అయినా అందులో అడవి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రిజర్వు ఫారెస్టు అన్ని భూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని, రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగు మండలంలో 500 ఎకరాల విస్తీర్ణంలో కోయంబత్తూర్‌ తరహాలో ఫారెస్టు కాలేజ్‌ ఏర్పాటు చేయనున్నట్లు సిఎం ప్రకటించారు. దీనికి సంబంధించి అంచనాలు తయారు చేయాలన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 34 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దాని చుట్టూ కందకం తవ్వి గచ్చకాయల తీగలతో కంచె వేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే మూడేళ్లలో పచ్చదనం ఆచరణలో కనిపించాలని చెప్పారు. పండ్లు, పూల చెట్లతో పాటు ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలని, గ్రామాల్లో దోమలు రాకుండా కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడతాయని సిఎం చెప్పారు. హైదరాబాద్‌ నగరంలోని గుర్రం గూడెం, దూలపల్లి, ఎస్‌ఆర్‌ నాయక్‌ నగర్‌, కొండ్ల కోయ, నాగారం, హరిణి వనస్థలి తదితర ప్రాంతాల్లో ఫారెస్టు బ్లాకులు ఉన్నాయని, వాటిని రక్షించాలన్నారు. వాటి చుట్టూ కేబిఆర్‌ పార్కు మాదిరిగా వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

మన అభిరుచుల మేరకు …శిశులను కనే ఆవకాశం

మంచి గుణాలు,శరీర ఆక్రుతి,అందంగా ఎటువంటి లోపాలు లేని శిశువులను కావాలనుకుంటున్నారా…అయితే  ఆర్‌ ఎస్‌ ఎస్‌ శాఖ శుధ్దికరణ్‌  కార్యక్రమంలో శిక్షణ పొందవలసివుంటుంది. ఆర్‌ ఎస్‌ ఎస్‌ సంస్థ  నిర్వహిస్తున్న గర్బ్‌ విజఞాన సంస్కార్‌ ప్రాజెక్టు ఆరోగ్య భారతి ఉన్నత సంతతి,మంచి గుణగణాలతో  సంతానం జన్మనించే కార్యక్రమం చేపట్టింది. ఈ గుణాలతో పిల్లను పొందాలనే దంపతులు శృంగారం మాత్రం వారి నక్షత్రాల మంచి గడియాలలో పాల్గోనాలని మూడు నెలల శ్రుధ్ది అవసరమని చెబుతున్నారు.ఇలాంటి  కార్యక్రమం పది సంవత్సారల క్రితమే గుజరాత్ లో ప్రారంభించామని,సంఘ్ సహకరమిస్తున్న విద్యాభారతి,గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో 10 శాఖలను,త్వరలో ఉత్తర్‌ ప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్ ప్రారంభించనున్నామని ఎక్స్ ప్రెస్‌ న్యూస్‌ పేపర్‌ వారికి తెలిపరిచారు. వీరి ముఖ్య ఉద్దేశం ఉత్తమ సంతానం, సంతతి చెందని శిశులకు  జన్మనివ్వటంతో  శక్తివంతమైన దేశం గా రూపొందించటానికి సాద్యమౌతుందని డాక్టర్‌ క్రిష్ణ మోహన్‌ దాస్‌ ,ప్రాజెక్టు కన్వీనర్‌ చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆయుర్వేధ శాస్త్ర సూచనల ఆధారంగా  ఉంటుంది కానీ సహజ సిద్ద గర్బధారణ కు వ...