ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాష్ట్రం పచ్చదనంతో కళకళ

రాష్ట్రంలోని రిజర్వు ఫారెస్టు అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని,ప్రతి ఇంచు అటవీ భూమిని సమర్దవంతంగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అధికారులకు సూచించారు.
సోమవారం సచివాలయంలో అటవీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, అటవీ శాఖ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకు అటవీ భూములు అయినా అందులో అడవి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రిజర్వు ఫారెస్టు అన్ని భూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని, రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగు మండలంలో 500 ఎకరాల విస్తీర్ణంలో కోయంబత్తూర్‌ తరహాలో ఫారెస్టు కాలేజ్‌ ఏర్పాటు చేయనున్నట్లు సిఎం ప్రకటించారు. దీనికి సంబంధించి అంచనాలు తయారు చేయాలన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 34 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దాని చుట్టూ కందకం తవ్వి గచ్చకాయల తీగలతో కంచె వేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే మూడేళ్లలో పచ్చదనం ఆచరణలో కనిపించాలని చెప్పారు. పండ్లు, పూల చెట్లతో పాటు ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలని, గ్రామాల్లో దోమలు రాకుండా కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడతాయని సిఎం చెప్పారు. హైదరాబాద్‌ నగరంలోని గుర్రం గూడెం, దూలపల్లి, ఎస్‌ఆర్‌ నాయక్‌ నగర్‌, కొండ్ల కోయ, నాగారం, హరిణి వనస్థలి తదితర ప్రాంతాల్లో ఫారెస్టు బ్లాకులు ఉన్నాయని, వాటిని రక్షించాలన్నారు. వాటి చుట్టూ కేబిఆర్‌ పార్కు మాదిరిగా వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..