ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

టీభేటీలతో హస్తినలో వేడి



వరుస టీభేటీలతో హస్తినలో విభజన వేడెక్కింది. డిసెంబర్ మూడున టీ బిల్లు కేబినెట్ ముందుకు రానున్నా కీలకాంశాలపై తర్జనభర్జన సాగుతూనే ఉంది. శీతాకాల సమావేశాల్లో టీ బిల్లు ప్రవేశపెట్టడం కష్టమని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాధ్ స్పష్టం చేసినా అగ్రనేతలు మాత్రం ఆఘమేఘాలపై టీ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. దీనిపై ప్రధాని నివాసంలో జరిగిన కోర్ భేటీలో వాడివేడి చర్చ జరిగింది.
 టెన్ జన్ పధ్, రేస్ కోర్స్ రోడ్, నార్త్ బ్లాక్...ఇలా హస్తిన అధికార కేంద్రాల్లో విభజన చర్చలు వాడివేడిగా సాగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే టీబిల్లు ప్రవేశపెట్టేలా కేంద్ర పెద్దలు టీ ఎక్సర్ సైజ్ ను ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో శుక్రవారం ఉదయం
 దిగ్విజయ్ సింగ్ జీవోఎం నివేదికలో కీలకంగా వ్యవహరిస్తున్న జైరాం రమేష్ తో భేటీ అయ్యారు. గత జీవోఎం భేటీలో హైదరాబాద్ పై షిండేకు తనకూ ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఆ విషయాలను డిగ్గీ రాజా జైరాంతో చర్చించారు. వివాదాస్పద అంశాలపై ఇరు ప్రాంతాలను మెప్పించేలా నివేదికకు తుదిమెరుగులు దిద్దడంపై ఇరువురూ చర్చించనట్లు తెలిసింది. అయితే జైరాంతో చర్చలను తాను వెల్లడించలేనని దిగ్విజయ్ చెప్పారు.అనంతరం డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. తమకు హైదరాబాద్ తో కూడిన పదిజిల్లాల తెలంగాణ కావాలని దిగ్విజయ్ ను కోరారు. రాయల తెలంగాణకు అంగీకరించమని స్పష్టం చేశారు. మరోవైపు జీవోఎం సభ్యులు జైరాం రమేష్, షిండే అధినేత్రి సోనియానుకలిసి జీవోఎం నివేదిక వివరాలను  చర్చించారు. సాయంత్రం ప్రధాని నివాసంలో జిరిగిన కోర్ కమిటీలో పూర్తిస్ధాయిలో సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంటరీవ్యవహారాల మంత్రి కమల్ నాధ్ ప్రత్యేక ఆహ్వానితుడుగా పాల్గొన్నారు. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే టీబిల్లు ప్రవేశపెట్టాలని కోర్ కమిటీ సభ్యులు కమల్ నాధ్ కు తెలుపగా సాధ్యాసాధ్యాలపై వారు చర్చించారు. అయితే కమల్ నాద్ మాత్రం ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం ఈ సీతాకాల సమావేశాల్లో టీబిల్లు తీసుకురావడం సాధ్యం కాదని అభిప్రాయంపడినట్లు తెలుస్తోంది. దాంతో కంగుతిన్న కోర్ కమిటీ సభ్యులు ఇది పార్టీ క్రెడిటిలిటీకి సంబందించిన సమస్యఅని శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెల్టాలని దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని కమల్ నాధ్్కు సూచించారు. తర్వాత కోర్ భేటీ నుంచి వెనుదిరిగిన కమల్ నాధ్. ఈ సెషన్ లో బిల్లు పెట్టడం సాధ్యం కాదని  చెప్పారుటీ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో కేబినెట్ భేటీ 3వతేదీనే జరగాలని కోర్ కమిటీలో నిర్ణయించారు. రెండున జరిగే జీవోఎం చివరి భేటీలో జీవోఎం నివేదికకు ఆమోదముద్ర వేస్తారు. ఆ నివేదికను హోంశాఖకు అందచేస్తారు. మూడున జరిగే కేబినెట్ భేటీలోనే జీవోఎం రిపోర్ట్ను చర్చకు తీసుకురానుంది. అయితే జీవోఎం కూడా హైదరాబాద్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. హైదరాబాద్ పై రెండు మూడు ఆప్షన్లు ఉంచినట్లు సమాచారం. హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాల తెలంగాణ ఇస్తూ సీమాంధ్రుల రక్షణ కోసం శాంతిభద్రతలు, విద్యుత్ , రెవిన్యూ, విద్యాఉద్యోగ తదితర అంశాలు గవర్నర్ చేతిలో పెట్టాలని ఒక ఆప్షన్ కాగా, హైదరాబాద్ ను కనీసం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనేది మరో ఆప్షన్, ఇక రాయల తెలంగాణ అనేది చిట్టచివరి ఆప్షన్ గా జీవోఎం పేర్కొంది.  ఇక సీమాంధ్రకు ఓక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం...ఈస్ట్ కోస్ట్ లో ఉన్న వాల్తేరు జోన్ ను ఆ జోన్ లోకి తేవడంతో సహా భారీ ప్యాకేజ్ లు సీమాంధ్రకు ప్రకటించడం, 37 పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో కలపడం వంటి వివరాలను జీవోఎం నివేదికలో పొందుపరిచారు. మొత్తంమీద జీవోఎం సిఫార్సులపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మార్పు చేర్పులకు ఇంకా అవకాశం ఉంటుందా అనుకున్న సమయానికి పార్లమెంట్ కు బిల్లు వెళుతుందో లేదో ఇలాంటి ప్రశ్నలకు తెరపడాలంటే మరో వారం వరకూ వెయిట్ చేయాల్సిందే..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

మన అభిరుచుల మేరకు …శిశులను కనే ఆవకాశం

మంచి గుణాలు,శరీర ఆక్రుతి,అందంగా ఎటువంటి లోపాలు లేని శిశువులను కావాలనుకుంటున్నారా…అయితే  ఆర్‌ ఎస్‌ ఎస్‌ శాఖ శుధ్దికరణ్‌  కార్యక్రమంలో శిక్షణ పొందవలసివుంటుంది. ఆర్‌ ఎస్‌ ఎస్‌ సంస్థ  నిర్వహిస్తున్న గర్బ్‌ విజఞాన సంస్కార్‌ ప్రాజెక్టు ఆరోగ్య భారతి ఉన్నత సంతతి,మంచి గుణగణాలతో  సంతానం జన్మనించే కార్యక్రమం చేపట్టింది. ఈ గుణాలతో పిల్లను పొందాలనే దంపతులు శృంగారం మాత్రం వారి నక్షత్రాల మంచి గడియాలలో పాల్గోనాలని మూడు నెలల శ్రుధ్ది అవసరమని చెబుతున్నారు.ఇలాంటి  కార్యక్రమం పది సంవత్సారల క్రితమే గుజరాత్ లో ప్రారంభించామని,సంఘ్ సహకరమిస్తున్న విద్యాభారతి,గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో 10 శాఖలను,త్వరలో ఉత్తర్‌ ప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్ ప్రారంభించనున్నామని ఎక్స్ ప్రెస్‌ న్యూస్‌ పేపర్‌ వారికి తెలిపరిచారు. వీరి ముఖ్య ఉద్దేశం ఉత్తమ సంతానం, సంతతి చెందని శిశులకు  జన్మనివ్వటంతో  శక్తివంతమైన దేశం గా రూపొందించటానికి సాద్యమౌతుందని డాక్టర్‌ క్రిష్ణ మోహన్‌ దాస్‌ ,ప్రాజెక్టు కన్వీనర్‌ చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆయుర్వేధ శాస్త్ర సూచనల ఆధారంగా  ఉంటుంది కానీ సహజ సిద్ద గర్బధారణ కు వ...