ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎగ్జిట్ పోల్స్ సర్వేలు

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం తప్పదని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ కు మొండిచేయి చూపారని, బీజేపీ భారీగా లబ్ది పొందుతుందని వెల్లడిస్తున్నాయి.
మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీల్లోనూ సత్తా చాటుతుందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ 161 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ప్రస్తుత శాసనసభలో బీజేపీ బలం 143 సీట్లే కాగా... ఇది మరో 18 స్థానాలకు పెరగనుందని సర్వే పేర్కొంది.  మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 62 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అంటే ప్రస్తుతం ఉన్న 71 మంది సభ్యుల బలం... 61కి పడిపోతుందని సీ ఓటర్ సర్వే పేర్కొంది.
 మధ్యప్రదేశ్ ప్రజల్లో చౌహాన్ కు ఉన్న ఆదరణే ఆ రాష్ట్రంలో బీజేపీకి కొండంత అండగా నిలిచింది. రెండు సార్లుగా చౌహాన్ అందించిన మంచి పాలన, అభివృద్ధి కూడా బీజేపీకి లాభించిందనే చెప్పాలి. మధ్యప్రదేశ్ లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ... అది ప్రభుత్వాన్ని మార్చేంతగా లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో అదే వెల్లడైంది. ఈ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సైతం ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అయితే అవేమీ పనిచేయలేదని... మంచి పాలనకు, అభివృద్ధికే ఓటర్లు మొగ్గు చూపారనే విషయం సీ ఓటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు నిజమైతే... హ్యాట్రిక్ హీరోగా చౌహాన్ కూడా మోడీ సరసన నిలుస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.