ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎగ్జిట్ పోల్స్ సర్వేలు

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం తప్పదని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ కు మొండిచేయి చూపారని, బీజేపీ భారీగా లబ్ది పొందుతుందని వెల్లడిస్తున్నాయి.
మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీల్లోనూ సత్తా చాటుతుందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ 161 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ప్రస్తుత శాసనసభలో బీజేపీ బలం 143 సీట్లే కాగా... ఇది మరో 18 స్థానాలకు పెరగనుందని సర్వే పేర్కొంది.  మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 62 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అంటే ప్రస్తుతం ఉన్న 71 మంది సభ్యుల బలం... 61కి పడిపోతుందని సీ ఓటర్ సర్వే పేర్కొంది.
 మధ్యప్రదేశ్ ప్రజల్లో చౌహాన్ కు ఉన్న ఆదరణే ఆ రాష్ట్రంలో బీజేపీకి కొండంత అండగా నిలిచింది. రెండు సార్లుగా చౌహాన్ అందించిన మంచి పాలన, అభివృద్ధి కూడా బీజేపీకి లాభించిందనే చెప్పాలి. మధ్యప్రదేశ్ లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ... అది ప్రభుత్వాన్ని మార్చేంతగా లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో అదే వెల్లడైంది. ఈ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సైతం ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అయితే అవేమీ పనిచేయలేదని... మంచి పాలనకు, అభివృద్ధికే ఓటర్లు మొగ్గు చూపారనే విషయం సీ ఓటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు నిజమైతే... హ్యాట్రిక్ హీరోగా చౌహాన్ కూడా మోడీ సరసన నిలుస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు