ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెల రోజుల వ్యవధిలో 12 వేల ఉద్యోగాల భర్తీ

రాష్ట్రంలో కొత్తగా 84 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వున్నందున శాఖల వారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కనీసం వారానికోసారి సమావేశమయి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోను, గురుకుల విద్యా సంస్థల్లోను వేలాది మంది ఉపాధ్యాయుల నియామకం జరపాల్సి వున్నందున దానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిప్యూటి సీఎం శ్రీ కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంద్రాగష్టు వేడుకల్లో ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆ మరునాడే బుధవారం నాడు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ తదితరులతో సీఎం మాట్లాడారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖాళీలను భర్తీ చేయడం, కొత్త ఉద్యోగాల నియామకం ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పని చేపట్టినా వాటిని అడ్డుకోవడానికి కొన్ని ప్రతీప శక్తులు కాచుకుని కూచున్నాయని, ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వుండాలని, న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. నోటిఫికేషన్లకు ముందే న్యాయ శాఖ అధికారులతో చర్చించాలని సూచించారు. ఎవరైనా కోర్టులో కేసులు వేస్తే కూడా వాటిని సమర్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని సీఎం చెప్పారు. అధికారులంతా పూర్తి సమన్వయంతో పనిచేయాలని కోరారు. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియను వేగంగా చేపట్టడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేశామని, దీనిద్వారా ఇప్పటికే 58 నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నట్లు టిఎస్ పిఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రికి వివరించారు. టిఎస్ పిఎస్సి ద్వారా ఇప్పటికే 5000 మందికి పైగా నియామకం అయ్యారని, మరో నెల రోజుల వ్యవధిలో 12 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగుస్తుందని సీఎంకు చెప్పారు. న్యాయపరమైన వివాదాలు కూడా కొలిక్కి వచ్చినందున త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో 84 వేలకు పెగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి వున్నందున పబ్లిక్ సర్వీసు కమిషన్ గురుతర బాధ్యత పోషించాలని సీఎం కోరారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ కు పని భారం పెరిగినందున అందులో కొత్తగా 90 మంది ఉద్యోగులను నియమించడానికి కూడా సీఎం అంగీకరించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి వాణీ ప్రసాద్, జీఎడి ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హ తదితరులు సమావేశమయ్యారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాఖల వారీగా ఉద్యోగాల భర్తీకి వెంటవెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీల వివరాలను కూడా ముందుగానే తీసుకుని నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా లక్షా 12 వేలకు పైగా ఉద్యోగాల నియామకాల లక్ష్యాన్ని అధిగమించేందుకు నిరంతరం కృషి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లినందున ఆ కేసులకు సంబంధించి కూడా న్యాయస్థానంలో సమర్దవంతంగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు. నియామకాలను వివాదస్పదం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండి తెలంగాణ యువతకు న్యాయం చేయడం లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..