మాజీ ఐపీఎస్అధికారి కిరణ్బేడీలో
రాజకీయ వైరాగ్యం కనిపిస్తోంది. ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం
చేశారు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి
అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్బేడీ, ఘోరమైన ఓటమిని చవి చూశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తర్వాత జీవితం ఎలా ఉంది అన్న మీడియా ప్రశ్నకు ఆమె రాజకీయ
వైరాగ్యాన్ని కనబరిచారు. తాను చురుకైన రాజకీయవేత్తనే కానని చెప్పారు. అయితే,
ప్రజాసేవపట్ల అనురక్తి మాత్రం తగ్గలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికలు తనకు
ముందెన్నడూ లేనంతటి అద్భుత అనుభవాన్నిచ్చాయని, తాను చేయాల్సిందేదో..
చేయకూడనిదేదో నేర్పాయని అన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి