దేశ రాజధాని న్యూఢిల్లీలో సర్వేలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుందని కొన్ని సర్వేలు, కాదు.. కాదు బీజేపీ గెలుస్తుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. సర్వేల్లో నాలుగు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని పీటీఐ వార్తాసంస్థ కథనం పేర్కొంది. బీజేపీకి 3 సీట్లు వస్తాయని ఇండియా టీవీ-సీ ఓటరు సర్వేలో,
36 సీట్లు వస్తాయని వీక్-ఐఎంబీఆర్ సర్వేలో-ఐబీఎన్7 సర్వేలో తేలింది.తాజాగా వెలువడిన సర్వే ఫలితాల్లో ఏకంగా మూడు సర్వేలో ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచనా వేశాయి. బీజేపీ 37
స్థానాలు సొంతం చేసుకుంటుందని, ఏఏపీకి 27
దక్కుతాయని ఇండియా టీవీ-సీ ఓటర్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ ఏడు సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. జీ-తలీమ్ సర్వే బీజేపీ 32
నుంచి 36
సీట్లు, ఏఏపీకి 30
నుంచి 34
దక్కుతాయని పేర్కొంది. కాంగ్రెస్కు ఆరు మాత్రమే ఇచ్చింది. న్యూ నేషనల్ చానల్ బీజేపీకి
30-35, ఏఏపీకి
30-34, కాంగ్రెస్కు
3-5 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి